News March 18, 2025

ఎర్రగుంట్లలో ప్రమాదం.. సత్యసాయి జిల్లా వ్యక్తి దుర్మరణం

image

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఇవాళ ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో సత్యసాయి జిల్లా వ్యక్తి దుర్మరణం చెందారు. ముందు వెళుతున్న వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన గండులూరి ఖాదరయ్య(41) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 25, 2025

ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే.!

image

ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే పలు ప్రయోజనాలున్నాయి. ‘రాత్రి నిద్రలో శరీరం నీటిని కోల్పోతుంది. కాబట్టి వాటర్ తాగడం ద్వారా శరీరం హైడ్రేట్ అవుతుంది. ఇది అలసట, తలనొప్పి తగ్గించి శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగై మలబద్దకం ఉన్నవారికి సహాయపడుతుంది. మెటబాలిజం 20-30% పెరిగి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యర్థాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది’ అని వైద్యులు చెబుతున్నారు.

News December 25, 2025

ఏటి ఈతకు లంక మేతకు సరి

image

ఒక పశువు నదిని (ఏరు) ఈదుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న లంక భూమికి వెళ్తుంది. అక్కడ కడుపు నిండా మేత మేస్తుంది. కానీ తిరిగి ఇంటికి రావాలంటే మళ్ళీ అదే నదిని ఈదుకుంటూ రావాలి. ఆ ఈతలో పడే కష్టం వల్ల మేసిన మేత అంతా అరిగిపోతుంది. అంటే, ఆ పశువుకు మేత వల్ల వచ్చిన శక్తి, నదిని ఈదడానికే ఖర్చయిపోతుంది. ఎవరైనా ఒక పనిలో ఎంత సంపాదిస్తున్నారో అదంతా ఆ పని చేయడానికే ఖర్చయిపోతే లాభంలేదని చెప్పడానికి ఈ సామెత వాడతారు.

News December 25, 2025

గురువారం నాడు ఈ పనులు చేస్తే అదృష్టం

image

గురువారం విష్ణుమూర్తి, బృహస్పతికి ప్రీతికరమైన రోజు. ఆర్థిక వృద్ధి, విజయం కలగాలంటే ఈరోజు నెయ్యి దీపం వెలిగించి అందులో కుంకుమ వేయాలని పండితులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదం తీసుకోవాలంటున్నారు. ‘పేదలకు అరటి, బొప్పాయి వంటి పసుపు పండ్లు దానం చేయాలి. విష్ణు సహస్రనామం చదవాలి. పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి, కుటుంబంతో కలిసి స్వీకరిస్తే సంతోషం కలుగుతుంది’ అంటున్నారు.