News March 26, 2025

ఎర్రగుంట్ల: తల్లిదండ్రులు మృతి.. అనాథలైన పిల్లలు

image

ఎర్రగుంట్ల (M) కలమలలో భార్యాభర్తలైన రాజారెడ్డి(45) సుజాత(35)ను నిన్న వ్యాన్ ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. రాజారెడ్డికి ఇద్దరు అమ్మాయిలు. ఎర్రగుంట్లలో ఆర్టీపీపీలో కార్మికుడిగా పనిచేస్తూ వారిని చదివిస్తున్నాడు. పెద్దమ్మాయి బీటెక్ చదువుండగా, చిన్నకుమార్తె ఇంటర్ చదువుతోంది. దీంతో వారు అనాథలయ్యారని గ్రామస్థులు కన్నీరుమున్నీరు అయ్యారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ రూ.4 లక్షలు ఇచ్చారు.

Similar News

News January 7, 2026

కడపలో శ్రీరామ శోభాయాత్ర, కళ్యాణ ఏర్పాట్లపై సమీక్ష

image

ఈనెల 21, 22 తేదీల్లో కడప మున్సిపల్ గ్రౌండ్స్‌లో జరగనున్న శ్రీరామ మహా శోభాయాత్ర, శ్రీ సీతారాముల కళ్యాణం విజయవంతం కావాలని మంగళవారం కలెక్టర్ శ్రీధర్ అధికారులతో సమీక్ష చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, MLA మాధవి కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఏర్పాట్లు సజావుగా, ఘనంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

News January 7, 2026

కడపలో శ్రీరామ శోభాయాత్ర, కళ్యాణ ఏర్పాట్లపై సమీక్ష

image

ఈనెల 21, 22 తేదీల్లో కడప మున్సిపల్ గ్రౌండ్స్‌లో జరగనున్న శ్రీరామ మహా శోభాయాత్ర, శ్రీ సీతారాముల కళ్యాణం విజయవంతం కావాలని మంగళవారం కలెక్టర్ శ్రీధర్ అధికారులతో సమీక్ష చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, MLA మాధవి కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఏర్పాట్లు సజావుగా, ఘనంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

News January 6, 2026

కడప జిల్లాలో ఉల్లి రైతులకు రూ.28.40 కోట్ల సాయం.!

image

కడప జిల్లాలో 7298 మంది ఉల్లి రైతులకు 14,203.31 ఎకరాలకు రూ.28.40 కోట్లు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.
*కమలాపురం 2526 మందికి రూ.11.32 కోట్లు
*మైదుకూరు 2352 మందికి రూ.7.74 కోట్లు
*పులివెందుల 1590 మందికి రూ.6.17 కోట్లు
*జమ్మలమడుగు 742 మందికి రూ.2.99 కోట్లు
*బద్వేల్ 67మందికి రూ.14.92 లక్షలు
*రాజంపేట 18మందికి రూ.2.33 లక్షలు
*కడప ఇద్దరికి రూ.35,900
*ప్రొద్దుటూరులో ఒకరికి రూ.20.60 వేలు.