News March 4, 2025

ఎర్రుపాలెం: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

image

ఎర్రుపాలెం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కోగంటి సాయిరాం (29) ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.

Similar News

News March 4, 2025

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS అమలు: సీపీ

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని, సమావేశాలు, ర్యాలీలు, మైకుల వినియోగం నిషేధించామని తెలిపారు. పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు మూసివేయాలని ఆదేశించారు.

News March 4, 2025

రఘునాథపాలెం: యువకుడి ఆత్మహత్య.. వ్యక్తి అరెస్టు

image

రఘునాథపాలెం మండలంలోని చిమ్మపూడికి చెందిన జనబాయి వెంకటేష్‌ ఆత్మహత్య కేసులో ఇదే మండలం కోటపాడుకు చెందిన బట్ట నాగేశ్వరావును సోమవారం అరెస్టు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. చిమ్మపూడికి చెందిన పాపయ్య కుమారుడు వెంకటేష్‌ను నాగేశ్వరరావు అసభ్యకర పదజాలంతో దూషించాడని ఆత్మహత్య చేసుకున్నాడు.  పాపయ్య ఫిర్యాదు చేయగా విచారణ అనంతరం నిందితుడిని అరెస్టు చేశామన్నారు.

News March 4, 2025

ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా గెలుపొందిన శ్రీపాల్ రెడ్డికి సర్టిఫికెట్ అందజేత

image

ఖమ్మం – వరంగల్- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపొందిన పింగిలి శ్రీపాల్ రెడ్డికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సర్టిఫికెట్‌ను అందజేశారు. హోరా హోరీ సాగిన స్థానంలో యుటిఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి పై పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!