News October 3, 2025

ఎర్రుపాలెం: మనవడి చేతిలో అమ్మమ్మ హత్య..?

image

ఎర్రుపాలెం మండలం సకినవీడు గ్రామంలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన శాఖమూరి పద్మ (60)ను ఆమె మనవడు శాఖమూరి చీరాల సాయి శుక్రవారం హతమార్చినట్లు చర్చించుకుంటున్నారు. పద్మ నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News October 1, 2025

‘ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి’

image

ఖమ్మం: ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని మాస్టర్ ట్రైనర్/ జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్ అన్నారు. బుధవారం డీపీఆర్సీ భవనంలో నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులకు, మాస్టర్ ట్రైనర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన హ్యండ్ బుక్ ఒకటికీ రెండుసార్లు పరిశీలించాలని, ముఖ్యమైన నిబంధనలు మార్క్ చేసి పెట్టుకోవాలని సూచించారు.

News October 1, 2025

హోంగార్డు కుటుంబానికి బీమా చెక్కు అందజేత: CP

image

గతేడాది మాదారం నుంచి ఖమ్మం విధులకు వెళ్తున్న ఖమ్మం యూనిట్‌కు చెందిన హోంగార్డు చందర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. కాగా హోంగార్డు కుటుంబానికి యాక్సెస్ బ్యాంక్ సాలరీ అకౌంట్‌తో వచ్చే ప్రయోజనాలు, ప్రమాద బీమా సొమ్ము రూ.34 లక్షల చెక్కు మంజూరైంది. బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హోంగార్డు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.

News October 1, 2025

నిర్ణీత లక్ష్యం మేరకు రైస్ డెలివరీ పూర్తి చేయాలి: అ.కలెక్టర్

image

నిర్ణీత లక్ష్యం మేరకు రైస్ డెలివరీ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్  పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్లో పెండింగ్ రా రైస్ డెలివరీపై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి గత ఖరీఫ్ సీజన్ పెండింగ్ ఉన్న 11 వేల 500 మెట్రిక్ టన్నులు రా రైస్, 3500 మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ రాబోయే 20 రోజులలో ఎఫ్సీఐకు సరఫరా చేయాలని సూచించారు.