News October 13, 2024

ఎర్రుపాలెం: వృద్ధ దంపతుల ఆత్మహత్య

image

ఎర్రుపాలెం మండల కేంద్రంలో వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Similar News

News October 13, 2024

KMM: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ మృతి

image

గంజాయి కేసులో తనను అక్రమంగా ఇరికించారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ భూక్యసాగర్ నాయక్ హైదరాబాదులో చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పోలీస్ అధికారుల పేర్లు చెబుతూ సూసైడ్ సెల్ఫీ వీడియో తీసీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించగా చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించారు.

News October 13, 2024

భద్రాచలంలో పేలిన గ్యాస్ సిలిండర్

image

భద్రాచలం పట్టణంలోని హోటల్ గీతాంజలి వీధిలో ఉన్న ఓ ఇంట్లో మహిళ దీపారాధన చేసింది. అనంతరం ఆరుబయట పనిచేస్తూ ఉండగా గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేశారు.

News October 13, 2024

కల్లోజి జయమ్మ మృతి పట్ల ఎంపీ సంతాపం

image

సీనియర్ జర్నలిస్టు, టీయూడబ్ల్యూజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్ మాతృమూర్తి కల్లోజి జయమ్మ ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మరణవార్త తెలిసి.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తల్లిని కోల్పోయి దు:ఖంలో ఉన్న శ్రీనివాస్ కు ఎంపీ రవిచంద్ర ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.