News February 20, 2025

ఎలమంచిలి: రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

image

అనకాపల్లి జిల్లాలో నిన్న జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. ఎలమంచిలికి చెందిన డి.సన్యాసిరావు బైకుపై వస్తుండగా.. లైనుకొత్తూరు వద్ద లారీ ఢీకొట్టడంతో మృతిచెందారు. అలాగే రేగుపాలెం వద్ద మరో ప్రమాదం జరిగింది. రాజాన మోహన్(24) బైకుపై వస్తూ రోడ్డు పక్కన వృద్ధుడిని ఢీకొట్టాడు. ఆ తర్వాత స్పీడ్ కంట్రోల్ చేయలేక ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. 

Similar News

News November 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 56 సమాధానాలు

image

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి ‘పరుశరాముడు’.
2. మేఘనాదుడు ‘తమ కుటుంబ దేవత అయిన నికుంభి’లను పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు.
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ‘శ్రవణం’.
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ‘ద్వాదశి’.
5. సీత స్వయంవరం లో ఉన్న శివ ధనుస్సు అసలు పేరు ‘పినాక’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 4, 2025

రాంపూర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నిర్మల్ ఎస్పీ

image

నర్సాపూర్(జి) మండలం రాంపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, మంగళవారం పరిశీలించారు. ఆమె ప్రమాదానికి సంబంధించిన వివరాలను స్థానిక అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్య డ్రైవింగ్ చేయొద్దని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించారు.

News November 4, 2025

పల్నాడు: అమర ప్రగతిని దత్తత తీసుకున్న అమెరికన్ దంపతులు

image

మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ దత్తత సంస్థ సంరక్షణలో ఉన్న అమర ప్రగతి అనే బాలికను అమెరికాకు చెందిన మిస్టర్ బ్రాడెన్ రీజ్ వెబ్ దత్తత తీసుకున్నారు. కేంద్ర దత్తత వనరుల సంస్థ (CARA) పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తయింది. జిల్లా ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అంతర్జాతీయ దత్తత ఇదే కావడం విశేషం. కలెక్టర్ కృతికా శుక్లా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.