News August 21, 2025
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలి: ఎస్పీ

గణేష్ చతుర్థి, మిలాద్-ఉన్-నబీ పండగలు ఏక కాలంలో వస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు. ఆయా మండల కేంద్రాల్లో పీస్ కమిటీ, డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్స్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. సబ్-డివిజన్ పరిధిలో ఎలాంటి ఘటనలు జరిగిన త్వరితగతిన స్పందించడానికి QRTలను ఏర్పాటు చేయాలని డీఎస్పీలకు సూచించారు.
Similar News
News August 22, 2025
నేటి ముఖ్యాంశాలు

*AP: రూ.904 కోట్లతో అమరావతిలో మౌలిక వసతులు
*AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త పోస్టుల మంజూరు
*TG: పంచాయతీరాజ్ శాఖలో రేపటి నుంచి పనుల జాతర
*కాళేశ్వరం నివేదిక రద్దుకు KCR పిటిషన్.. విచారణ రేపటికి వాయిదా
*మరోసారి జంగ్ సైరన్ మోగించిన TG ఉద్యోగ సంఘాల JAC
*రేపటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ షురూ
*GSTలో 2 శ్లాబుల(5%, 18%) విధానానికి మంత్రుల బృందం ఆమోదం
*ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం: మోదీ
News August 22, 2025
పవన్ కళ్యాణ్ సూచన.. CBN అభినందనలు

AP: ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. నాలా చట్టసవరణపై చర్చిస్తుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచన చేశారు. సాగుభూమిని వ్యవసాయేతరంగా మార్చేటప్పుడు లభించే ఆదాయం పంచాయతీలకు అందేలా చూడాలని, తద్వారా పంచాయతీలు బలోపేతం అవుతాయని చెప్పారు. దీనిపై స్పందించిన చంద్రబాబు మంచి సూచన చేశారని పవన్ను అభినందించారు. పవన్ సూచనలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News August 22, 2025
వేములవాడలో మహా లింగార్చన పూజ

మాస శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం మహా లింగార్చన పూజ ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు జ్యోతులను లింగాకారంలో వెలిగించి, ప్రత్యేక పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. మాస శివరాత్రి రోజున మహా లింగార్చన పూజను దర్శించుకుంటే సకల దోషాలు తొలగి పుణ్యఫలాలు లభిస్తాయని అర్చకులు తెలిపారు. ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.