News March 7, 2025

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో వాటికి పేమెంట్ జరిగి ప్రక్రియ పూర్తయ్యే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్‌లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ GWMC కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా పంచాయతీ, తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీ శాఖల్లో ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News July 7, 2025

సంగారెడ్డి: యాప్‌లో వివరాలు నమోదు చేయాలి: డీఈవో

image

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. విద్యార్థులకు అందించిన పుస్తకాలు, యూనిఫామ్ వివరాలను అందులోనే నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే ప్రధాన ఉపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 7, 2025

వరంగల్: అప్పుల ఊబిలో గ్రామ పంచాయతీలు..!

image

జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. జిల్లాలో 13 మండలాలు ఉండగా ఇందులో 325 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏడాదిన్నరకు పైగా గ్రామాల్లో ప్రత్యేక పాలనే నడుస్తోంది. దీంతో కార్యదర్శులు అన్నీ తామై అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడంతో ఒక్కో కార్యదర్శి దాదాపు రూ.2 లక్షలకు పైగా అప్పు చేశామని వాపోతున్నారు.

News July 7, 2025

నూజివీడు: అధికారులపై సబ్ కలెక్టర్ ఆగ్రహం

image

నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నేడు జరిగింది. సకాలంలో అన్ని శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో సబ్ కలెక్టర్ స్మరణ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం ఏర్పాటు చేస్తే అధికారులు సరైన సమయానికి రాలేదు. ఇలాంటి ఘటనలు పునారవృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.