News March 22, 2025

ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ 

image

ఎల్ఆర్ఎస్ ఆమోదించిన దరఖాస్తులకు సంబంధించిన లబ్ధిదారుల నుంచి ఫీజు వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సత్య శారద తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి ధన కిషోర్ ఎల్ఆర్ఎస్‌పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎల్ఆర్ఎస్ 2020 స్కీం కింద ఫ్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు 41,443 దరఖాస్తులు రాగా.. అందులో 18,943 మంజూరు చేయగా, 100% ఫీజు వసూల్ చేయాలన్నారు.

Similar News

News March 22, 2025

వరంగల్ జిల్లాలో తగ్గుతున్న భూగర్భ జలాలు

image

వరంగల్ జిల్లాలో వేసవి దృష్ట్యా భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. గతేడాది ఫిబ్రవరి కంటే ఈ ఏడాది మరింత లోతుకు పడిపోయాయి. జిల్లాలో దుగ్గొండి, ఖానాపురం, ఖిలా వరంగల్ మినహా మిగతా 10 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపు చేసుకునేందుకు ఇళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలను తవ్వడం, నీటి వృథాను అరికట్టడం వంటి చర్యలు ఉత్తమ మార్గం.

News March 22, 2025

తొర్రూర్‌లో బాలికకు అబార్షన్!

image

ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మైనర్ బాలికకు గర్భస్రావం చేసిన ఘటన తొర్రూరులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాలు.. దంతాలపల్లి మం.కి చెందిన ఓ బాలిక గర్భం దాల్చడంతో ఆస్పత్రికి తీసుకురాగా అబార్షన్ చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న చైల్డ్ లైన్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితుడిపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

News March 22, 2025

ఖానాపూర్: పాకాల వాగు సమీపంలో ముసలి ప్రత్యక్షం

image

గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఉన్న పాకాల వాగు వద్ద మొసలి కలకలం రేపింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో చెరువులు, వాగులు, కుంటలల్లో చుక్క నీరు లేకుండా పోయింది. దీంతో శుక్రవారం రాత్రి పాకాల వాగు వద్ద మొసలి రోడ్డు పైనుంచి దాటుతుండంతో గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయంలో ఈ దారిగుండా వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు తెలుపుతున్నారు.

error: Content is protected !!