News January 26, 2025

ఎల్కతుర్తి PS వద్ద యాక్సిడెంట్.. మహిళ మృతి 

image

ఎల్కతుర్తి మండల పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందారు. మృతురాలు జంగం బుజ్జమ్మ(55)గా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహం వద్ద బంధువులు రోదిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 17, 2025

HYD పోలీసులకు పవన్ కళ్యాణ్ అభినందనలు

image

సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ సజ్జనార్‌కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్న ముఠాలతో చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో పైరసీ ముఠా అరెస్ట్ శుభపరిణామన్నారు.

News November 17, 2025

HYD పోలీసులకు పవన్ కళ్యాణ్ అభినందనలు

image

సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ సజ్జనార్‌కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్న ముఠాలతో చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో పైరసీ ముఠా అరెస్ట్ శుభపరిణామన్నారు.

News November 17, 2025

భవాని దీక్షల విరమణకు ప్రత్యేక ఏర్పాట్లు: ఈవో

image

భవాని దీక్షల విరమణ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై ఆలయ అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 4న జరిగే కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీక్షా విరమణ సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఈవో సిబ్బందిని ఆదేశించారు.