News March 26, 2025

ఎల్బీనగర్‌లో మర్డర్.. నిందితుల అరెస్ట్

image

LBనగర్ శివగంగకాలనీలో మార్చి 23న పాతకక్షలతో మహేశ్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పురుషోత్తం, నాగార్జున, సందీప్, రాము, రాజరాకేశ్, కుంచల ఓంకార్‌ నిందితులుగా ఉన్నారు. వీరి నుంచి ఫోన్‌లు, బైకు, కారు, గొడ్డలి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు CI వినోద్ కుమార్ తెలిపారు.

Similar News

News January 10, 2026

నెల్లూరులో వర్షాలు.. నంబర్లు సేవ్ చేసుకోండి

image

అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజల సహాయార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఏమైనా సహాయం కావాలంటే ప్రజలు కంట్రోల్ రూము నెంబర్లు 0861-2331261, 7995576699 /1077 సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

News January 10, 2026

అమరావతిలో క్వాంటం సెంటర్‌కు టెండర్ ఖరారు

image

AP: రాజధానిలో క్వాంటం వ్యాలీ నిర్మాణ దిశగా మరో కీలక అడుగు పడింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ను APCRDA ఖరారు చేసింది. రూ.103 కోట్లతో L-1 బిడ్‌గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగిస్తూ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ జారీ చేసింది. ఈ ప్రాజెక్టు నమూనా రూపకల్పన నుంచి నిర్మాణం వరకూ L&Tనే చేపట్టనుంది. సెంటర్ నిర్మాణానికి CRDA నిధుల నుంచి రూ.137 కోట్లు కేటాయించారు.

News January 10, 2026

కర్నూలు: Be Careful.. సంక్రాంతి హెచ్చరిక

image

సంక్రాంతి పండుగను లక్ష్యంగా చేసుకుని ఫేక్ షాపింగ్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ యాప్‌లు, ఫిషింగ్ లింకులు, WhatsApp, SMSల ద్వారా వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, OTPలు దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.