News September 11, 2025
ఎల్లారెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో పులి అడుగులు?

వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామ సమీపంలో పులి అడుగులను గ్రామస్థులు గుర్తించారు. రెండు రోజుల క్రితం రామప్ప వాన గుట్టకు పులి అరుపులు వినిపించాయని స్థానికులు తెలపగా, అటవీ శాఖ అధికారులు వానగుట్ట ప్రాంతంలో పరిశీలన చేపట్టారు. రామప్ప వానగుట్ట నుంచి ఎల్లారెడ్డిపల్లి అటవీ ప్రాంతం మీదుగా పులి మేడారం వైపు వెళ్తుండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది.
Similar News
News April 14, 2026
కృష్ణా: పీజీఆర్ఎస్కు 132 అర్జీలు

పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్లో నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్కు అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 132 అర్జీలు అందినట్టు అధికారులు తెలిపారు. శాఖల వారీగా అర్జీలను విభజించి ఆయా శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం బదిలీ చేశామన్నారు.
News April 14, 2026
కృష్ణా: పీజీఆర్ఎస్కు 132 అర్జీలు

పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్లో నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్కు అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 132 అర్జీలు అందినట్టు అధికారులు తెలిపారు. శాఖల వారీగా అర్జీలను విభజించి ఆయా శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం బదిలీ చేశామన్నారు.
News April 14, 2026
అట్రాసిటీ బాధితురాలికి సర్కారు కొలువు!

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితురాలు టీ. దుర్గకు ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉద్యోగం కల్పించిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమెకు పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్గా నియామక ఉత్తర్వులు అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ, జీవనోపాధి కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.


