News August 16, 2025
ఎల్లారెడ్డిపేటలో వృద్ధురాలితో జెండా ఎగురవేత

ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ సభ్యులు 79వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. స్వాతంత్ర్యం వచ్చిన 1947లో జన్మించిన ముత్యాల చంద్రవ్వ(79)తో జాతీయజెండాను ఎగురవేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుంపెటి గౌరీశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ వృద్ధురాలు ఎంతో ఆనందం వ్యక్తంచేశారు. ఈ అవకాశం కల్పించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వినూత్న ఆలోచన స్థానికుల ప్రశంసలు అందుకుంది.
Similar News
News August 16, 2025
కాసేపట్లో భారీ వర్షాలు: TGiCCC

TG: కాసేపట్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ కమాండ్&కంట్రోల్ సెంటర్ హెచ్చరించింది. సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తెల్లవారుజామున 4 గంటల్లోపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ మేరకు ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజులు పంపింది.
News August 16, 2025
అల్లూరి జిల్లా ఎస్పీ, జేసీలకు ప్రశంసాపత్రాలు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ప్రశంసాపత్రాలు, అవార్డులను అందుకున్నారు. పాడేరులో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ దినేష్ కుమార్ వాటిని అందించారు. అలాగే పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, అదనపు ఎస్పీ ధీరజ్, చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా అసిస్టెంట్ కలెక్టర్ నాగ వెంకట సాహిత్ కూడా ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
News August 16, 2025
ADB: GREAT.. బడి కోసం రూ.60 లక్షల భూదానం

భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల క్రీడా స్థలం కోసం గ్రామానికి చెందిన పన్నాల భూమారెడ్డి, సంజీవరెడ్డి దాదాపు రూ.60 లక్షల విలువైన 1.5 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువకులు గ్రామ పెద్దలు వారిని ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్వచ్ఛందంగా దాతలు ముందుకు రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు.