News February 18, 2025

ఎల్లారెడ్డిపేట: బస్సు టైర్ పంచర్.. తప్పిన ప్రమాదం

image

ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామ శివారులోని బస్సు టైర్ పంచర్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అన్నారు. వీర్నపల్లి మండలం వన్‌పల్లి నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు 110మంది ప్రయాణికులతో వెళుతుండగా బస్సు ఒక్క సైడు ఒరిగి ఆగిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సిరిసిల్ల నుంచి వన్ పల్లికి మరికొన్ని బస్సులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Similar News

News February 28, 2026

ఆంథ్రోపిక్‌కు ట్రంప్ ‘నో యూజ్’ షాక్

image

ఆంథ్రోపిక్ AI టెక్నాలజీ వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని ట్రంప్ తమ అన్ని ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు. Claude AI సాఫ్ట్‌వేర్‌లోని సేఫ్‌గార్డ్స్ తొలగించి యుద్ధాల్లో వాడేలా చేయాలన్న పెంటగాన్ ఒత్తిడికి ఆ సంస్థ నిరాకరించడమే దీనికి కారణం. అటానమస్ వెపన్స్ తయారీకి సహకరించలేమని కంపెనీ స్పష్టం చేసింది. దీనిపై మండిపడిన ట్రంప్.. సైన్యం ఎలా పోరాడాలో నిర్ణయించే అధికారం ఒక ప్రైవేట్ సంస్థకు లేదని పేర్కొన్నారు.

News February 28, 2026

పాక్ సెమీస్‌కు వెళ్లాలంటే..

image

ఇంగ్లండ్‌ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. నేడు శ్రీలంకతో జరిగే చివరి S-8 మ్యాచ్‌లో పాక్ భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ పాక్ మొదట బ్యాటింగ్ చేస్తే లంకను 64 పరుగుల తేడాతో ఓడించాలి. అదే ఛేజింగ్‌లో అయితే 13.1 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాలి. అప్పుడే రన్ రేట్ పరంగా కివీస్‌ను వెనక్కి నెట్టి పాక్ సెమీస్‌కు చేరుకుంటుంది. లేదంటే న్యూజిలాండ్ ముందడుగు వేస్తుంది.

News February 28, 2026

ఇరాన్‌తో సుదీర్ఘ యుద్ధం ఉండదు: JD వాన్స్

image

ఇరాన్‌పై ఒకవేళ సైనిక దాడులు చేసినా అది సుదీర్ఘ యుద్ధానికి దారితీసే అవకాశం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ అణు దేశంగా మారకుండా అడ్డుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం సైనిక, దౌత్యపరమైన వ్యూహాలను పరిశీలిస్తోందని తెలిపారు. గతంలో ఇరాక్ యుద్ధం వంటి తప్పులు మళ్లీ జరగవని పేర్కొన్నారు. ప్రస్తుతానికి చర్చల ద్వారానే పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.