News April 25, 2024

ఎల్లారెడ్డిపేట: మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి పై కేసు నమోదు

image

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అమాయక ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడటంతో అతనిపై కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గ్రామానికి చెందిన దీకొండ సునీల్ అనే వ్యక్తి యూనిక్ ఎస్ఎంసిఎస్ అనే సంస్థ పేరుతో 800 మంది వద్ద డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు. బాధితులు ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని తెలిపారు.

Similar News

News February 2, 2026

KNR: మున్సిపల్ ‘పోరు’.. బీజేపీ అభ్యర్థుల ఖరారు

image

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల సమరంలో బీజేపీ ముందడుగు వేసింది. మొత్తం 66 డివిజన్‌లకు బీజేపీ 66 పార్టీ టికెట్లను కేటాయించింది. దీంతో ఇప్పటి వరకు ఎవరికి టికెట్ వస్తుందనే ఉత్కంఠకు తెరపడింది. ఇక అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. నేటి నుంచి బీజేపీ అభ్యర్థుల తరుఫున కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రచారం మొదలుపెట్టారు.

News February 2, 2026

KNR: రేపటితో ముగియనున్న ‘బి-ఫామ్’ల గడువు

image

కరీంనగర్‌ మున్సిపల్‌ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. అభ్యర్థులు తమ పార్టీల అధికారిక ‘బి-ఫామ్‌’లను సమర్పించేందుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఆలోపు పత్రాలు అందని పక్షంలో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. టికెట్ల కేటాయింపుపై పార్టీల అగ్రనేతలు కసరత్తు కొనసాగిస్తుండగా, ఆశావహులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.

News February 2, 2026

కరీంనగర్ ‘పుర’పోరు.. మేయర్ పీఠంపై ముమ్మర వ్యూహాలు

image

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే నెల 11న పోలింగ్ జరగనుండగా.. ప్రధాన పార్టీలన్నీ మేయర్ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ BC జనరల్‌కు రిజర్వ కావడంతో హేమాహేమీలు రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ తన అధికార బలాన్ని, BRS తన పట్టును, BJP ఎంపీ చరిష్మాను నమ్ముకున్నాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తూ ఉత్కంఠను రేపుతున్నాయి.