News February 12, 2025
ఎల్లారెడ్డి: అపార్ వివరాలను తక్షణమే పూర్తి చేయాలి: డీఈఓ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739355581144_50226745-normal-WIFI.webp)
ఆపార్ వివరాలను ఆన్లైన్లో తక్షణమే పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఆదేశించారు. ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో బుధవారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశానికి హాజరై మాట్లాడారు. యుడైస్లోని ఖాళీలు పూర్తి చేయాలన్నారు. సెలబస్ పూర్తిచేసి రివిజన్ చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించారు. ఎంఈఓ వెంకటేశం పాల్గొన్నారు.
Similar News
News February 12, 2025
కొత్త 50 రూపాయల నోట్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739372887723_653-normal-WIFI.webp)
ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఈమేరకు ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న చాలా నోట్లు మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో ప్రింట్ అయ్యాయి. ఆయన స్థానంలో గతేడాది డిసెంబర్లో వచ్చిన సంజయ్ పేరుతో కొత్త రూ.50 నోట్లను ముద్రించాలని ఆర్బీఐ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఉన్న పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.
News February 12, 2025
రామగుండం: వారం వ్యవధిలో తనువు చాలించిన భార్యాభర్తలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739377934377_50226861-normal-WIFI.webp)
తనువు ఆ తర్వాత మనువు తో కలిసిన ఆ బంధం కట్టే కాలే వరకు కొనసాగింది. 4 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు తనువు చాలించిన సంఘటన గోదావరిఖనిలో చోటుచేసుకుంది. స్థానిక బాపూజీ నగర్కు చెందిన ఆకునూరి లక్ష్మి ఈనెల 2న మరణించగా 4 రోజుల వ్యవధిలో భర్త ఆకునూరి దుర్గయ్య తనువు చాలించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన కుటుంబం లో విషాదాన్ని మిగిల్చింది.
News February 12, 2025
మన్యంకొండకు పోటెత్తిన భక్త జనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739368513711_60392612-normal-WIFI.webp)
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లానుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అర్ధరాత్రి జరిగే (తెరు) రథోత్సవాన్ని వీక్షించడానికి భక్తజనం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, కాలినడకన కదలి రావడం జరిగింది. గోవిందా.. హరి.. గోవిందా అంటూ గోవిందా నామాలతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.