News July 14, 2024

ఎల్లారెడ్డి: పాము కాటుతో వ్యక్తి మృతి

image

ఎల్లారెడ్డి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పాము కాటుతో ఒకరి మృతి చెందిన ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంభం నాగయ్య (45) శనివారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో పాము కాటు వేయడంతో, కుటుంబీకులు మెరుగైన చికిత్స కోసం కామరెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే నాగయ్య మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News February 9, 2026

NZB: రంజాన్ ఉపవాస దీక్షలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: Adtl. కలెక్టర్

image

రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వమించారు. రంజాన్ ఉపవాస దీక్షలకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

News February 9, 2026

NZB: జనసేన బోణీ కొడుతుందా.. యూటర్న్ తీసుకుంటుందా?

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో దిగిన జనసేన ఇక్కడ బోణీ కొడుతుందా? లేక యూ టర్న్ తీసుకుంటుందా? అన్న చర్చ జరుగుతోంది. నగరంలోని 11 డివిజన్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వారికి మద్దతుగా ప్రచారానికి వస్తారని అనుకున్నా అది క్యాన్సిల్ అయ్యింది. ఈ క్రమంలో పోటీ చేస్తున్న వారు Uటర్న్ తీసుకుని బీజేపీకి మద్దతు పలుకుతారా? లేక బరిలో ఉంటారా? అనేది చూడాల్సిందే.

News February 9, 2026

అశోక్ సాగర్ చెరువులో మహిళ మృతదేహం

image

ఎడపల్లి మండలం జానకంపేట శివారులో అశోక్ సాగర్ చెరువులో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యమైన విషయం తెసిందే. ఐతే మృతదేహం ఆచూకీ లభ్యమైనట్లు ఎస్సై ముత్యాల రమ తెలిపారు. మృతురాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్, కమ్యూనిటీ హాల్ ప్రాంతానికి చెందిన అష్రఫ్ బేగం(60)గా గుర్తించినట్లు చెప్పారు.