News May 10, 2024

ఎస్కేయూ దూరవిద్య ఫలితాల విడుదల

image

అనంతపురం రూరల్ మండలంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు గురువారం ఉపకులపతి హుస్సేన్ రెడ్డి విడుదల చేశారు. బీఏలో 159 మందికి గాను 104 మంది ఉత్తీర్ణులయ్యారు. బీకాంలో 22 మందికి గాను 13 మంది, బీబీఏ, బీకాం కంప్యూటర్స్‌లో 150 మందికి గాను 98 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

Similar News

News September 12, 2025

5 నుంచి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ: జేసీ

image

జిల్లాలో కొత్త స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ప్రకటించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో 6,57,828 రేషన్ కార్డుదారులకు ఈనెల 15 నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు అందిస్తామని చెప్పారు.

News September 11, 2025

అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ ఈయనే!

image

అనంతపురం జిల్లా కొత్త కలెక్టర్‌గా ఓ.ఆనంద్ నియమితులయ్యారు. కేరళ రాష్ట్రం మలప్పురంలో జన్మించిన ఆయన కేరళ యూనివర్సిటీలో బీటెక్ పట్టభద్రుడయ్యారు. 2016 IAS బ్యాచ్‌కు చెందిన ఆనంద్ కేవలం 24 ఏళ్ల వయస్సులోనే IAS అయ్యారు. UPSC పరీక్షలో ఆల్ ఇండియా 33వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుత కలెక్టర్ డా.వినోద్ కుమార్ బాపట్ల జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.

News September 11, 2025

అనంత జిల్లాలో వర్షం.. పిడుగులు పడే అవకాశం..!

image

అనంతపురం జిల్లాలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. ‘ఇప్పటికే మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చేటప్పుడు చెట్లు, టవర్స్, విద్యుత్ స్తంభాలు, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదు. సురక్షితమైన ప్రాంతాలలో ఆశ్రయం పొందాలి’ అంటూ ఫోన్లకు సందేశాలు పంపింది. ఇలాంటి మెసేజ్ మీకు కూడా వచ్చిందా అయితే కామెంట్ చేయండి.