News August 10, 2024
ఎస్పీ సతీశ్ కుమార్ను కలిసిన జేసీ భార్గవ్

ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమష్టిగా పని చేయాలని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. ఈ మేరకు ఇటీవల జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన భార్గవ్ తేజ ఎస్పీని శనివారం కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శాంతి భద్రతలపై సమష్టిగా పనిచేయాలని ఎస్పీ సూచించారు.
Similar News
News February 16, 2026
గుంటూరులో ఫలితాలలో షాక్.. D గ్రేడ్లో 2,123 మంది విద్యార్థులు

SSC 100 రోజుల యాక్షన్ ప్లాన్ సమ్మేటివ్ అసెస్మెంట్-1 ఫలితాల్లో గుంటూరు జిల్లా మిశ్రమ ఫలితాలు సాధించింది. మొత్తం 10,332 మంది విద్యార్థుల్లో 568 మంది A గ్రేడ్, 2,239 మంది B గ్రేడ్, 4,912 మంది C గ్రేడ్ సాధించగా, 2,123 మంది D గ్రేడ్లో నిలిచారు. D గ్రేడ్ శాతం గణనీయంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యాశాఖ 46 పరీక్షల మూల్యాంకనం ద్వారా మెరుగుదలపై దృష్టి సారించింది.
News February 16, 2026
శాఖల సమన్వయం.. ప్రశాంతంగా మహాశివరాత్రి తిరునాళ్లు

శివరాత్రి సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని శివాలయాలు భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. లక్షలాది మంది భక్తులు దర్శనానికి తరలివచ్చినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఎండోమెంట్స్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆరోగ్యశాఖ, RTC అధికారుల ప్రణాళికలు, సమన్వయంతో తిరునాళ్లు విజయవంతమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలు ఫలించి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు వెల్లడించారు.
News February 16, 2026
అమరావతి నిర్మాణానికి బిల్ గేట్స్ కితాబు

రాజధానిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణ తీరును బిల్ గేట్స్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రేట్ వర్క్ అంటూ గేట్స్ కితాబిచ్చారు. ఆర్టీజీఎస్లోని డిస్ ప్లే వాల్స్పై ప్రజెంటేషన్లను బిల్ గేట్స్ పరిశీలించారు.


