News March 22, 2025
ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్

కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ఎస్సీలు, ఎస్టీలు ప్రత్యేక పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News February 5, 2026
T20 WC: భారత్ ఘన విజయం

T20 WC వార్మప్ మ్యాచ్లో SAపై భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 240 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (20 బాల్స్లో 53), తిలక్ వర్మ (19 బంతుల్లో 45) దూకుడుగా ఆడగా, హార్దిక్ పాండ్య (10 బంతుల్లో 30) చివర్లో మెరుపులు మెరిపించారు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.
News February 5, 2026
‘వైద్య సేవల్లో నాణ్యత పెంచాలి’

సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ బుధవారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్లడ్ బ్యాంకుల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. మాతా-శిశు మరణాల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వ్యాధి నిరోధక టీకాలపై ఈ వారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని వెల్లడించారు. జిల్లాలో వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యేలా చూడాలని ఆయన కోరారు. సమావేశంలో డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం పాల్గొన్నారు.
News February 5, 2026
దేశంలో ఇంటర్నెట్ లేని ఇళ్లు 13.7 శాతం

దేశంలో డిజిటల్ సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అందరికీ ఆ ప్రయోజనాలు చేరడం లేదు. దేశంలోని ప్రతి 7 ఇళ్లలో ఒకటి ఇప్పటికీ ఇంటర్నెట్కు దూరంగా ఉంది. సుమారు 13.7% కుటుంబాలకు ఆన్లైన్ సదుపాయం లేదు. అయితే మెట్రో నగరాలు దాదాపు పూర్తిగా డిజిటల్గా మారాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని పలు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. AI, 5G, డిజిటల్ గవర్నెన్స్ దిశగా అడుగులు వేస్తున్న వేళ ఈ గ్యాప్ ఆందోళన కలిగిస్తోంది.


