News March 22, 2025
ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్

కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ఎస్సీలు, ఎస్టీలు ప్రత్యేక పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News January 9, 2026
అనకాపల్లి: ఉపాధి హామీలో పని దినాలు పెరిగాయ్.. వేతనాలు తగ్గాయ్!

ఉపాధి హామీ పథకంలో కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన చట్టం ప్రకారం వేతనదారులకు పని దినాలను పెంచి రోజువారీ వేతనాలను తగ్గించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి రానుంది. ఉపాథి పథకం వేతనదారులకు ఇప్పటివరకు రోజుకు రూ.307 వేతనాన్ని ఇచ్చేవారు. ఇకపై ఆ వేతనాన్ని రూ. 240 తగ్గించి పని దినాలను 125 రోజులకు పెంచారు. దీనిపై ప్రజా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
News January 9, 2026
కృష్ణపల్లిలో చిన్నారులపై భోగిపండ్లను పోసి ఆశీర్వదించిన కలెక్టర్

పార్వతీపురం మండలం కృష్ణపల్లి అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. చిన్నారులు సంప్రదాయ వేషధారణలు వేశారు. అంగన్వాడీ ప్రాంగణలో భోగిమంటలు, హరిదాసు కీర్తనలతో పండగ శోభ సంతరించుకుంది. చిన్నారులకు కలెక్టర్ భోగి పండ్లను వేసి నిండు నూరేళ్ల పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించారు. జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డితో పాటు వివిధ శాఖలాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
News January 9, 2026
నీవా బ్రాంచ్ కేనాల్ TO కళ్యాణి డ్యామ్ వయ నారావారిపల్లి

TTD, తిరుపతి వాసుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన HNSS–కళ్యాణి డ్యామ్ అనుసంధానం ప్రాజెక్టుకు గతేడాది అక్టోబర్లో ఆమోదం లభించింది. రూ.126.06 కోట్లతో పైప్లైన్ నిర్మాణం చేపట్టి, భారీ పైప్లైన్ ద్వారా కృష్ణా జలాలను KR కండ్రిగ, కనితి మడుగు, నాగపట్ల, వెంకటరాయణి, NVపల్లి సమీపంలోని మూలపల్లి చెరువులను నింపుకుంటూ చివరగా కళ్యాణి డ్యామ్కు నీరు చేరేలా ప్రణాళిక రూపొందించారు.


