News October 18, 2025

ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు రూ. 220 కోట్ల బకాయిలు: కొప్పుల ఈశ్వర్

image

జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిధిలోని సంక్షేమ శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలకు రావాల్సిన రూ. 220 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించబడలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. జగిత్యాలలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సరుకుల సరఫరా కూడా నిలిచిపోయిందని కొప్పుల తెలిపారు.

Similar News

News October 18, 2025

మీ దగ్గర స్కూళ్ల బంద్ ఉందా?

image

TG: BC సంఘాల ‘రాష్ట్ర బంద్’ పిలుపు మేరకు పలు స్కూళ్ల యాజమాన్యాలు సెలవులిస్తూ తల్లిదండ్రులకు మెసేజులు పంపాయి. OU పరిధిలో ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. కొన్ని స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా నడవనుండగా బంద్ పాటించాలని BC, విద్యార్థి సంఘాలు కోరే అవకాశముంది. మరోవైపు RTC డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఇప్పటికే పలు పార్టీలు రోడ్లపైకి వచ్చి బంద్ పాటిస్తున్నాయి. ఇంతకీ మీ దగ్గర స్కూళ్ల బంద్ ఉందా?

News October 18, 2025

MBNR: మద్యం దుణాకాలను ఒకేరోజు 1524 దరఖాస్తులు

image

మద్యం దుకాణాలకు నేటితో గడువు ముగియనుంది. నిన్న 1,524 దరఖాస్తులు రావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో 227 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పటికి 2,735 వచ్చాయి. MBNR 883, NGKL 668, NRPT 423, GDWL 467, WNP 294 దరఖాస్తులు చేసుకున్నారు. చివరి తేదీ కావడంతో భారీ స్పందని ఉండొచ్చని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. నాన్‌ రిఫండబుల్‌ విధానంలో ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షల ఫీజు ఉండటంతో దరఖాస్తులు రాలేదని పలువురు అంటున్నారు.

News October 18, 2025

వరి కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

వరి పంట కోతకి వారం లేదా 10 రోజుల ముందు నుంచే నీటి తడిని ఆపివేయాలి. కంకిలో 90 శాతం గింజలు పక్వానికి వచ్చాకే వరి కోత చేపట్టాలి. గడ్డి పొడిపొడిగా, గింజలు బంగారు రంగులోకి, ఎర్ర గొలుసుగా మారి కంకులు కిందకి వంగినప్పుడు కోతలను చేపట్టాలి. పంట పక్వానికి రాకముందే కోస్తే, కంకిలోని గింజలు పూర్తిగా నిండక దిగుబడి తగ్గే అవకాశం ఉంది. మరీ ఆలస్యంగా కోస్తే చేను పడిపోయి గింజ ఎక్కువగా రాలి దిగుబడి తగ్గే అవకాశం ఉంది.