News June 6, 2024
ఎస్.కోటలో తాత రికార్డు బద్దలు కొట్టిన మనుమరాలు
ఉత్తరావల్లి నియోజకవర్గ కేంద్రంగా ఉన్నప్పుడు 1983లో కోళ్ల లలిత కుమారి తాత అప్పలనాయుడు టీడీపీ తరఫున 30,329 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటి వరకు అదే అత్యధిక మెజార్టీ. S.కోట నియోజకవర్గ కేంద్రం ఏర్పాటయ్యాక 2009లో TDP తరఫున పోటీ చేసిన కోళ్ల 3,440 ఓట్ల ఆధిక్యత సాధించగా.. 2104లో 28,572 మెజార్టీతో గెలిచింది. ఈ ఎన్నికల్లో 38,790 ఓట్ల మెజార్టీతో గెలిచి.. తన తాత పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.
Similar News
News September 29, 2024
సౌర విద్యుత్పై అవగాహన కల్పించాలి: VZM జేసీ
ప్రతీ ఇంట్లో సౌర విద్యుత్ వినియోగించుకొనే విధంగా వినియోగదారులను చైతన్యపరచాలని జేసీ ఎస్.సేతుమాధవన్ కోరారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం అమలుపై శనివారం సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండలాల వారీగా పథకం అమలును సమీక్షించారు.
News September 28, 2024
VZM: రేపు శాప్ ఎండీ గిరీశ పి.ఎస్ జిల్లాకు రాక
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ. గిరీశ పి.ఎస్.ఆదివారం జిల్లాలో పర్యటించనున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 12 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకొని విజ్జీ స్టేడియం వద్ద శాప్ క్రీడా మైదానాన్ని పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం క్రీడా సంఘాలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.
News September 28, 2024
విజయనగరం జిల్లా క్విజ్.. వీటికి సమాధానాలు తెలుసా.?
1. విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడింది.?
2. బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది.?
3. విజయనగరం జిల్లాలోని 4నదుల పేర్లు చెప్పండి?
4. జిల్లాకు చెందిన ద్వారం వెంకటస్వామి నాయుడు ఏ రంగంలో నిష్ణాతుడు.? ఈ ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ రూపంతో తెలియజేయండి.
NOTE: వీటి ఆన్సర్లను ఇదే ఆర్టికల్లో మధ్యాహ్నం 3గంటలకు మీరు చూడవచ్చు.