News May 19, 2024
ఎస్.కోట: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

ఎస్.కోట మండలం వెంకటరమణపేటకు చెందిన అప్పలస్వామి అనే గొర్రెల కాపరి ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందాడు. ఎప్పటిలాగే తన మేకలను మేపేందుకు గ్రామ సమీపంలో మెట్టకు వెళ్లాడు. సాయంత్రం మేకలు ఇంటికి వచ్చినప్పటికీ అప్పలస్వామి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వెతికారు. ఈ నేపథ్యంలో అప్పలస్వామి గ్రామ సమీపంలో పిడుగు పడి మృతి చెంది ఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు తీవ్రంగా రోదిస్తూ వెల్లడించారు.
Similar News
News November 4, 2025
పాత నేరస్థుల కదలికలపై నిఘానే కీలకం: VZM SP

జిల్లాలో నేరాలను అరికట్టడంలో పాత నేరస్థుల కదలికలపై నిఘానే కీలకమని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. హిస్టరీ షీటర్లు, పాత నేరస్థులపై ప్రత్యేక బృందాలు కట్టుదిట్టంగా నిఘా పెట్టాలని సూచించారు. రాత్రి గస్తీని ముమ్మరం చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి రవాణా, జూదాలు, కోడి పందాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
News November 4, 2025
రైల్వే స్టేషన్లలో సమస్యలపై ప్రస్తావించాం: VZM ఎంపీ

విజయనగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లలో వేచి ఉండే హాల్, మరుగుదొడ్లు, ఎస్కలేటర్లు, తదితర సదుపాయాలు కల్పించాలని ఎంపీ అప్పలనాయుడు కోరారు. విశాఖలో మంగళవారం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్కి హాల్ట్, భువనేశ్వర్, తిరుపతి రైళ్లను ప్రతిరోజూ నడపడం, శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని కోరినట్లు ఎంపీ తెలిపారు.
News November 4, 2025
VZM: విజేతలను అభినందించిన ఎస్పీ

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులు, ఉద్యోగులను తన కార్యాలయంలో SP దామోదర్ అభినందించారు. ప్రథమ బహుమతిగా రూ.2వేలు, ద్వితీయ బహుమతిగా రూ.1500, తృతీయంగా రూ.1000 చొప్పున నగదు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు గుడ్ టచ్-బ్యాడ్ టచ్ పై అవగాహన పెంపొందించుకోవాలని, ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంట్లో పెద్దలకు చెప్పాలని సూచించారు.


