News March 6, 2025
ఎస్.రాయవరం: యువకుల ప్రాణం తీసిన అతివేగం..!

రైల్వే న్యూకాలనీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో తిక్కవానిపాలేనికి చెందిన వాసుపల్లి గోపి కుమారుడు యశ్వంత్(21), గొడుగు అచ్చిరాజు కొడుకు సాయికుమార్(20) <<15656341>>మృతి చెందారు<<>>. యశ్వంత్ కుటుంబం బతుకుతెరువు కోసం ఎస్.రాయవరం నుంచి నగరానికి వలస వచ్చారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బైక్ 120 స్పీడ్లో నడిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Similar News
News February 22, 2026
అయోడిన్ లోపంతో మహిళల్లో ఎన్నో సమస్యలు

అయోడిన్ మన జీవక్రియల్లో కీలకపాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి అయోడిన్ను గ్రహించి, దాన్ని థైరాయిడ్ హార్మోన్లుగా మారుస్తుంది. లేదంటే శరీర ఉష్ణోగ్రత, శ్వాస, గుండె వేగం, జీవక్రియ, జీర్ణక్రియ దెబ్బతింటాయి. అయోడిన్ లోపిస్తే గాయిటర్ వస్తుంది. అలాగే కొందరు మహిళల్లో రొమ్ముల్లో క్యాన్సర్రహిత గడ్డలు ఏర్పడతాయి. చేపలు, సీ ఫుడ్, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తుల్లో అయోడిన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
News February 22, 2026
భీమవరం: అనంత బాబు కేసులో ఉన్నతాధికారి సస్పెండ్

కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన MLC అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పట్లో డీఎస్పీగా ఉండి, నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోలేదన్న ఆరోపణలపై ప్రస్తుతం ప.గో.జిల్లా ఏఎస్పీగా ఉన్న భీమరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
News February 22, 2026
T20 WC: SAతో మ్యాచుకు భారత జట్టు ఇదేనా?

సూపర్-8లో ఇవాళ SAతో మ్యాచులో IND ప్లేయింగ్-11 ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. అభిషేక్ను తొలగిస్తారని, తిలక్ స్థానంలో శాంసన్ ఆడిస్తారన్న వార్తలను కెప్టెన్ సూర్య ప్రెస్ కాన్ఫరెన్స్లో కొట్టిపారేశారు. దీంతో వారిద్దరూ ఆడతారని కన్ఫర్మ్ అయింది. సుందర్ స్థానంలో అక్షర్ టీమ్లోకి రావొచ్చు.
ప్లేయింగ్11(అంచనా): సూర్య, అభిషేక్, ఇషాన్, తిలక్, హార్దిక్, అక్షర్, దూబే, రింకు, వరుణ్, బుమ్రా, అర్ష్దీప్.


