News September 6, 2025

ఏక్లవ్య ఓటీటీలో ప్రపంచస్థాయి విద్య

image

HYD కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ఏక్లవ్య ఓటీటీ ప్లాట్‌ఫారాన్ని ప్రటించింది. దీనిద్వారా ప్రపంచస్థాయి విద్య అందుతుందని, పేస్ బేస్డ్ సిస్టమ్ నుంచి మాస్టరీ బేస్డ్ సిస్టమ్ వైపు అడుగు పెడుతున్నట్లు పేర్కొంది. అత్యుత్తమ ఉపాధ్యాయుల వద్ద విద్యార్థులు విద్య నేర్చుకునేందుకు వీలుగా ఈ ప్లాట్ ఫారమ్ నిర్మించినట్లు డైరెక్టర్ సంతోశ్ రెడ్డి, MLA సుధీర్ రెడ్డి ప్రారంభ కార్యక్రమంలో తెలిపారు.

Similar News

News September 6, 2025

భారీ వరదలు.. బీజేపీ ఎంపీల డిన్నర్ పార్టీ రద్దు

image

బీజేపీ ఎంపీలకు ఇవాళ రాత్రి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవ్వాల్సిన డిన్నర్ పార్టీ రద్దయింది. ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలకు విందు ఇవ్వాలని బీజేపీ ఇటీవల నిర్ణయించింది. అయితే పంజాబ్‌, J&K తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో 100 మందికి పైగా చనిపోవడంతో డిన్నర్ పార్టీని క్యాన్సిల్ చేశారు. ఈనెల 8న పీఎం నివాసంలో జరగాల్సిన NDA ఎంపీల విందు కూడా రద్దయింది.

News September 6, 2025

స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్న వడ్డాది ప్రిన్సిపల్

image

వడ్డాది ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జి.చిన్నారావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు స్వీకరించారు. శుక్రవారం సాయంత్రం అమరావతిలో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, మెమెంటో స్వీకరించారు.16 ఏళ్ల నుంచి ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పని చేశారు. ఇటీవల పదోన్నతిపై వడ్డాదికి ప్రిన్సిపల్‌గా వచ్చారు

News September 6, 2025

శ్రీకాకుళం: ఇంటర్ పూర్తి చేశారా..ఈ అవకాశం మీకోసమే

image

ఇంటర్మీడియేట్ వృత్తి, విద్యా కోర్సులు అభ్యసించి ఉత్తీర్ణులైన వారికి అప్రెంటిస్ మేళా జరగనుంది. ఈ నెల 8న ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించే ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ వృత్తి విద్యాశాఖ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. అప్రెంటిస్ ఎంపికలతో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ ఐటీఐ ఎచ్చెర్ల ప్రిన్సిపల్ ఎల్.సుధాకరరావు కన్వీనర్ అన్నారు.