News December 24, 2025

ఏజెన్సీ ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు

image

AP: ఏజెన్సీలోని ఆసుపత్రులకు మందులు తదితరాలను ఇకనుంచి డ్రోన్ల ద్వారా అందించనున్నారు. ఈమేరకు ‘రెడ్ వింగ్’ అనే సంస్థతో వైద్యారోగ్యశాఖ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఈ సంస్థ అరుణాచల్ ప్రదేశ్‌లో ఇలాంటి సేవలు అందిస్తోంది. పాడేరు కేంద్రంగా 80 KM పరిధిలోని ఆసుపత్రులకు ఈ సంస్థ డ్రోన్లతో మందులు అందిస్తుంది. డ్రోన్లు తిరిగి వచ్చేటపుడు రోగుల రక్త, మల, మూత్ర నమూనాలను తీసుకువస్తాయని కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు.

Similar News

News December 27, 2025

కొత్త జిల్లాల ఏర్పాటు.. ఈ నెల 31న తుది నోటిఫికేషన్!

image

AP: జిల్లాలు, డివిజన్ల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై ప్రైమరీ <<18386076>>నోటిఫికేషన్<<>> రిలీజ్ చేసిన ప్రభుత్వం నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించింది. నేటితో గడువు ముగుస్తుండటంతో మార్పులు, చేర్పులపై మంత్రులు, అధికారులతో CM చర్చించారు. మొత్తం 927 అభ్యంతరాలు రాగా వాటిని పరిశీలించిన ప్రభుత్వం ఈ నెల 31న తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది.

News December 27, 2025

పిల్లలకు జ్వరంతో పాటు ఫిట్స్ వస్తుంటే..

image

ఆరు నెలల నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలో జ్వరంతో పాటు కొందరికి ఫిట్స్​ వస్తుంది. రోజులో రెండు, మూడు సార్లు వస్తే మాత్రం సీరియస్​గా తీసుకోవాలి. తల్లిదండ్రులకు చిన్నప్పుడు ఫిట్స్​ ఉంటే అదీ పిల్లలకు వంశపారపర్యంగా వస్తుంది. జ్వరంతోపాటు తలనొప్పి, వాంతులు, చురుకుగా ఉండకపోవడం, బీపీ తగ్గిన సమయంలో ఫిట్స్​ వస్తే మాత్రం సీరియస్​గా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మెదడువాపు వ్యాధి లక్షణాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

News December 27, 2025

₹240 కోట్లతో బాలామృతం.. నాణ్యత లోపిస్తే నష్టం

image

AP: 7 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లలకు బాలామృతం కింద ₹240 CRతో న్యూట్రిషన్ పౌడర్, హెల్త్ మిక్స్ పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు టెండర్లు పిలిచింది. పసివారికిచ్చే ఇవి నాణ్యతగా ఉండాలి. లేకుంటే దుష్ప్రభావం చూపుతాయి. అందుకే అనుభవమున్న కంపెనీలకే దీన్ని అప్పగించాలి. అయితే రాగి పిండి, చిక్కీలు తయారీ చేసే సంస్థలకు ఇచ్చేలా రూల్ మార్చారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకు ‘TG ఫుడ్స్’ పౌడర్ ఇస్తున్నారు.