News January 3, 2026
ఏడూళ్ల బయ్యారంలో జాతీయ కబడ్డీ సమరం: కలెక్టర్

పినపాక ఏడూళ్ల బయ్యారం జడ్పీ పాఠశాలలో ఈ నెల 7 నుంచి 69వ జాతీయ స్థాయి అండర్-17 బాలుర కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లా ప్రతిష్ఠ చాటేలా ఈ పోటీలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News January 5, 2026
‘రాయలసీమ ప్రాజెక్ట్’పై అసలేం జరిగిందంటే…

రాయలసీమకు సాగునీటి కోసం YS జగన్ CMగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే అనుమతులు లేకుండా దీన్ని చేపట్టారని TG SCని ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్లొద్దని కేంద్రమూ APని ఆదేశించింది. మరోవైపు జి.శ్రీనివాస్(TG) అనే వ్యక్తి కేసు వేయగా పనులు ఆపేయాలని 2020 OCT 29న NGT తీర్పిచ్చింది. 2024లోనూ పనుల నిలుపుదలకు ఆదేశాలిచ్చింది. దీనిపై 2025 MARలో AP కౌంటర్ దాఖలు చేసింది. ఈనెల 22న NGTలో విచారణ జరగనుంది.
News January 5, 2026
పార్వతీపురం: ‘ప్రతి ఫిర్యాదుకు నాణ్యమైన పరిష్కారం చూపడమే లక్ష్యం’

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశించారు. సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో తాజాగా నిర్వహించిన వారాంతపు నివేదికల సమీక్షా సమావేశంలో వివిధ శాఖల పనితీరును విశ్లేషించారు.ప్రజల నుంచి సేకరించిన ప్రతి అర్జీని, అదే వారం శనివారం సాయంత్రానికి కచ్చితంగా పూర్తి చేయాలని అధికారులు గడువు విధించారు.
News January 5, 2026
మళ్లీ పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18766451>>మళ్లీ<<>> పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.2,020 పెరిగి రూ.1,37,840కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,850 ఎగబాకి రూ.1,26,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.8వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


