News October 21, 2024

ఏపీఈఆర్సీ ఛైర్మన్, సీఎస్‌ను కలిసిన కలెక్టర్

image

కర్నూలులోని ఏపీఈఆర్సీ భవనంలో ఏపీఈఆర్సీ 2024-29 ప్లానింగ్ అంశాలపై చర్చించేందుకు కర్నూలుకు విచ్చేసిన ఏపీఈఆర్సీ ఛైర్మన్ సీవీ నాగార్జునరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను సోమవారం కలెక్టర్ రంజిత్ బాషా కలిశారు. కలెక్టర్ వారికి పూల మొక్కలను అందజేశారు. అనంతరం కలెక్టర్ వారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి జిల్లాలోని పలు ప్రాధాన్యత అంశాలను చర్చించారు.

Similar News

News January 26, 2026

వ్యవసాయ శకటానికి మొదటి స్థానం: కలెక్టర్

image

77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధ్యక్షతన పోలీస్ పరేడ్ మైదానంలో ప్రదర్శించిన శకటాల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. వ్యవసాయ శాఖ శకటానికి మొదటి బహుమతి, దేవాదాయ శాఖ శకటానికి 2వ బహుమతి, జిల్లా విద్యా శాఖ, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ శకటాలకు 3వ బహుమతిని కలెక్టర్ ప్రకటించారు. అనంతరం వారికి జేసీ, ఎస్పీలతో కలిసి జ్ఞాపకలను అందజేశారు.

News January 26, 2026

వ్యవసాయ శకటానికి మొదటి స్థానం: కలెక్టర్

image

77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధ్యక్షతన పోలీస్ పరేడ్ మైదానంలో ప్రదర్శించిన శకటాల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. వ్యవసాయ శాఖ శకటానికి మొదటి బహుమతి, దేవాదాయ శాఖ శకటానికి 2వ బహుమతి, జిల్లా విద్యా శాఖ, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ శకటాలకు 3వ బహుమతిని కలెక్టర్ ప్రకటించారు. అనంతరం వారికి జేసీ, ఎస్పీలతో కలిసి జ్ఞాపకలను అందజేశారు.

News January 26, 2026

అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం: కలెక్టర్

image

సమిష్టి కృషితో జిల్లాని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుదామని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. సోమవారం కర్నూలులో 77వ గణతంత్ర వేడుకలలో భాగంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్‌తో కలిసి కలెక్టర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని కలెక్టర్ చదివి ప్రజలకు వినిపించారు. అంతకుముందు వారు ఆయుధ దళాల నుంచి గౌరవ వందనాలు స్వీకరించారు.