News March 24, 2025

ఏపీపీఎస్సీ పరీక్షలకు పగడ్బందిగా ఏర్పాట్లు చేయండి: జేసీ

image

ఈ నెల 25 నుంచి 27 తేదీ వరకు జిల్లాలో జరిగే ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏపీపీఎస్సీ పరీక్షలపై జేసీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.

Similar News

News March 28, 2025

దేవనకొండ: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

దేవనకొండ మండలం తెర్నెకల్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గిరిపోగు ప్రతాప్(27) శుక్రవారం సాయంత్రం గ్రామసభ షామియానా తీసే సమయంలో పైన ఉన్న కరెంట్ తీగలు తగిలి షాక్ కొట్టింది. వెంటనే అక్కడే ఉన్న వారు దేవనకొండ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News March 28, 2025

కర్నూలు జిల్లా TODAY TOP NEWS..!

image

➤ ‘కిలోకి రూ.10 కమీషన్’ నిరూపిస్తే ఆస్తులు రాసిస్తా: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
➤ ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురికి నామినేటెడ్ పదవులు
➤ సీ.బెళగల్ వీఆర్వోపై టీడీపీ నేత దాడి
➤ రూ.14 లక్షలు పలికిన ఒంగోలు గిత్త
➤ ఆదోని: పెట్రోల్ బంకులో చోరీ.. రూ.90 వేలు మాయం
➤ హొలగుంద మండలంలో గ్యాస్ లీక్.. ఇల్లు దగ్ధం
➤ మంత్రాలయం నేతలకు వైసీపీలో పదవులు
➤ కుట్రలకు పాల్పడినా మాదే విజయం: ఎస్వీ మోహన్ రెడ్డి

News March 28, 2025

రూ.14 లక్షలు పలికిన ఒంగోలు గిత్త

image

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని డి.రంగాపురం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి ఒంగోలు జాతి గిత్తను రూ.14 లక్షలకు విక్రయించారు. ప్రకాశం జిల్లా ముదిరముప్పాల గ్రామానికి చెందిన శేషాద్రి చౌదరి గిత్తను కొనుగోలు చేశారు. ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఈ ఒంగోలు గిత్త ఎడ్ల పోటీల్లో సత్తా చాటుతోంది. ఇది వరకు పలు పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో బహుమతులను గెలుపొందింది.

error: Content is protected !!