News December 20, 2025

ఏపీ ఇంటర్ బోర్డుకు అరుదైన ఘనత: మంత్రి లోకేశ్

image

AP ఇంటర్ బోర్డుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్&ట్రైనింగ్ (NCVET) రికగ్నిషన్ లభించిందని మంత్రి లోకేశ్ తెలిపారు. దేశంలో అవార్డింగ్ బాడీ (AB-డ్యుయల్)గా గుర్తింపు పొందిన తొలి బోర్డుగా AP ఇంటర్ బోర్డు నిలిచిందన్నారు. దీని వల్ల వొకేషనల్ స్కిల్స్‌కు నేషనల్ లెవెల్‌లో సర్టిఫికేషన్ ఇచ్చే అర్హత BIEకి దక్కిందని తెలిపారు. తొలి దశలో సెరికల్చర్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్‌కు అనుమతి లభించిందన్నారు.

Similar News

News December 22, 2025

హిందువులారా మేల్కోండి.. కాజల్ పోస్ట్

image

బంగ్లాదేశ్‌లో హిందువులను కాపాడాలంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘హిందువులారా మేల్కోండి. మౌనం మిమ్మల్ని రక్షించదు’ అని పేర్కొన్నారు. దీపూ చంద్రదాస్ అనే హిందువును దారుణంగా చంపి చెట్టుకు కట్టి తగలబెట్టిన ఎడిటెడ్ వీడియోను పోస్ట్ చేశారు. ‘ALL EYES ON BANGLADESH HINDUS’ అని క్యాప్షన్ పెట్టారు.

News December 22, 2025

నెల రోజుల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

TG: కోడిగుడ్ల <<18636145>>ధరలతో<<>> పాటు చికెన్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కార్తీక మాసం తర్వాత నెల రోజుల వ్యవధిలోనే చికెన్ సెంటర్ల నిర్వాహకులు పలు చోట్ల ఏకంగా రూ.100 పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నెల కిందటి వరకు రూ.210-220 ఉండగా ఇప్పుడు రూ.300కు చేరింది. న్యూఇయర్ వరకు రూ.330కి చేరవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడం, ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చులు పెరగడమే దీనికి కారణమని అంటున్నారు.

News December 22, 2025

యూరియా బుకింగ్ ఇక యాప్‌తో మాత్రమే

image

TG: యూరియా పొందాలంటే రైతులు నేటి నుంచి Fertilizer Booking Appతో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఈనెల 20 నుంచి కొన్ని జిల్లాల్లో ఈ విధానం అందుబాటులోకి రాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఇదే విధానం అమలుకానుంది. పారదర్శకంగా, నిజమైన లబ్ధిదారులకే యూరియా పంపిణీకి ఈ విధానం తెచ్చామని ప్రభుత్వం తెలిపింది. యాప్ ద్వారా యూరియా ఎలా బుక్ చేసుకోవాలి?, ఏ పంటకు ఎన్ని బస్తాలు ఇస్తారో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.