News November 10, 2025
ఏపీ టుడే

* ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం. సీఐఐ సమ్మిట్, మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టాలపై అంచనాలు, పరిహారంపై చర్చకు అవకాశం. అమరావతి అభివృద్ధి కోసం రుణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్.
* ఇవాళ, రేపు మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండుగా విడిపోయి పర్యటన. నేడు బాపట్లలో టీమ్-1, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరిలో టీమ్-2 పంట నష్టాలపై అంచనా వేయనున్నాయి.
Similar News
News November 10, 2025
ఫెదరర్ రికార్డును దాటేసిన జకోవిచ్

టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ సంచలనం సృష్టించారు. ఏథెన్స్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచి కెరీర్లో 101వ సింగిల్స్ టైటిల్ అందుకున్నారు. ఇటలీ ప్లేయర్ ముసెట్టితో జరిగిన ఫైనల్లో 4-6, 6-3, 7-5 తేడాతో విజయం సాధించారు. దీంతో హార్డ్ కోర్టులపై జకోవిచ్ సాధించిన టైటిల్స్ సంఖ్య 72కు చేరింది. పురుషుల సింగిల్స్లో ఇదే అత్యధికం. తర్వాతి స్థానంలో ఫెదరర్(71) ఉన్నారు.
News November 10, 2025
కలలో శివయ్య కనిపిస్తే..?

‘కలలో శివుడిని/శివ లింగాన్ని చూడటం పవిత్రమైన సంకేతం. కలలో శివలింగం కనిపిస్తే దీర్ఘకాల సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయి. పరమేశ్వరుని దర్శనం లభిస్తే, మీ ఆదాయం పెరిగి, అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. శివాలయం కనిపిస్తే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శివుని మెడలో పాము కనిపిస్తే ఆర్థిక లాభాలుంటాయి. త్రిశూలం కనిపిస్తే సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది’ అని స్వప్న శాస్త్రం చెబుతోంది.
News November 10, 2025
వారంతా మూర్ఖులు: ట్రంప్

తన పాలసీ టారిఫ్లను వ్యతిరేకించే వారంతా మూర్ఖులేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వీటి వల్లనే అమెరికా మరింత సంపన్న దేశంగా మారడంతో పాటు అత్యంత గౌరవనీయ దేశంగా మారిందని చెప్పారు. టారిఫ్ల వల్ల లక్షల కోట్ల డాలర్లు వస్తున్నాయని ప్రతి అమెరికన్కూ కనీసం 2వేల డాలర్ల చొప్పున డివిడెంట్ ఇస్తామని పేర్కొన్నారు. త్వరలోనే 37 ట్రిలియన్ డాలర్ల రుణాలను చెల్లించడం ప్రారంభిస్తామన్నారు.


