News November 8, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* సీఎం చంద్రబాబు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తర్వాత జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఎంపికపై సీనియర్ నేతలతో చర్చించారు.
* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీభక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. తత్వవేత్తగా, స్వరకర్తగా సమాజ చైతన్యానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆదరణ పథకం కింద పేదలకు పనిముట్లు అందిస్తామని చెప్పారు.

Similar News

News April 5, 2026

ఒకే కథ.. 3 ప్రాజెక్టులు!

image

‘కుమారస్వామి’ కథతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా తెరకెక్కించాలని డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఈ కథాంశంతోనే మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి ఆయన కేవలం నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్. కాగా ‘కుమారస్వామి’పై తానూ ఓ స్క్రిప్ట్ రాసుకున్నట్లు కిశోర్ తిరుమల కూడా గతంలో వెల్లడించారు. మరి వీటిలో ఏది ముందుగా థియేటర్లలోకి వస్తుందో చూడాలి.

News April 5, 2026

రత్నమైనా, పద్యమైనా.. విలువ దేనికంటే?

image

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టడేలా?
చాటు పద్యమిలను చాలదా యొక్క
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: శ్రేష్ఠమైన నీలి రంగు రత్నం ఒక్కటి ఉన్నా చాలు. దానికి ఎంతో విలువ ఉంటుంది. తళతళ మెరిసే రాళ్లు తట్టెడు ఉన్నా ఉపయోగం లేదు. అలాగే రసవంతమైన, అర్థవంతమైన పద్యం ఒక్కటున్నా చాలు. వేల సంఖ్యలో అర్థం లేని పద్యాలతో మంచి జరగదు.<<-se>>#PADHYAM<<>>

News April 5, 2026

TG EAPCETకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే

image

తెలంగాణ ఈఏపీసెట్ దరఖాస్తుల (లేట్ ఫీజు లేకుండా) గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2,89,974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 53.34% మంది అమ్మాయిలు, 46.66% మంది అబ్బాయిలు ఉన్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమింగ్‌కు 2,03,167 అప్లికేషన్లు వచ్చాయి. నేటి నుంచి ఈ నెల 10 వరకు రూ.250 లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు EAPCET <>వెబ్‌సైట్<<>> చూడండి.