News February 20, 2025
ఏపీ మోడల్ స్కూల్ను తనిఖీ చేసిన కలెక్టర్

గోస్పాడులోని ఏపీ మోడల్ స్కూల్ను కలెక్టర్ జీ.రాజకుమారి గురువారం తనిఖీ చేశారు. పాఠశాల పరిసర ప్రాంతాలు, తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆర్వో ప్లాంట్లో లీకేజీ సమస్యను గుర్తించి మరమ్మతులు చేయించాలని కలెక్టర్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలోని ల్యాబ్ గదులన్నింటికీ తాళాలు వేయకుండా వాటిని క్రమం తప్పకుండా వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు.
Similar News
News November 15, 2025
కృష్ణా : RTCలో ఐటీఐ అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

APSRTCలో ITI అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ITI ఉత్తీర్ణులైన వారు అప్రెంటీస్ షిప్ కొరకు ఈ నెల 30వ తేదీలోపు www.apprenticeshipindia.gov.in ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని విజయవాడ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్ తెలిపారు. ITI మార్క్స్, సీనియారిటీ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.
News November 15, 2025
400 MOUలు.. రూ.11,91,972 కోట్ల పెట్టుబడులు

విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. రూ.11,91,972 కోట్ల పెట్టుబడులతో 400 ఎంఓయూలు జరిగాయి. వీటి ద్వారా 13,32,445 ఉద్యోగాలు రానున్నాయని అధికార యంత్రాంగం తెలిపింది. ఏపీ సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐఅండ్ఐ, పరిశ్రమలు-వాణిజ్యం, ఐటీ, మున్సిపల్ శాఖల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.
News November 15, 2025
మహబూబాబాద్: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు. MHBD పట్టణం కంకర బోర్డులోని జడ్పీ హై స్కూల్లో సోషల్ టీచర్గా పని చేస్తున్న రవి 10 రోజులుగా ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తల్లితో చెప్పింది. ఆమె ఫిర్యాదుతో టీచర్పై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.


