News April 14, 2024
ఏపీ సీఎంపై దాడి.. స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో సీఎం జగన్ కనుబొమ్మపైన గాయమైంది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఖమ్మం పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రచారంలో హింసతో కూడిన కార్యక్రమాలు మంచివి కాదన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఘటనలను ఎవరూ సమర్థించరన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 27, 2026
ఖమ్మం: విద్యుత్తు సమస్యల పరిష్కారానికి ‘వాట్సాప్’

విద్యుత్తు వినియోగదారుల సమస్యల త్వరితగతిన పరిష్కారానికి 7901628348 నంబరుతో వాట్సాప్ చాట్ బాట్ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసచారి తెలిపారు. వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈ నంబరుకు ‘Hi’ అని పంపి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కంప్లైంట్ ఐడీ ద్వారా సమస్య పరిష్కారాన్ని ట్రాక్ చేయవచ్చని, పారదర్శక సేవలే సంస్థ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
News February 27, 2026
ఖమ్మం: విద్యార్థుల్లో పెరుగుతున్న దృష్టి లోపాలు

రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద జిల్లాలో నిర్వహించిన కంటి పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. సెల్ఫోన్ల వాడకం, పోషకాహార లోపంతో 42,277 మంది విద్యార్థులను పరీక్షించగా, 2,297మందిలో దృష్టి లోపాలున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి త్వరలోనే కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో గుండె జబ్బులు, ఇతర శారీరక లోపాలున్న విద్యార్థుల కోసం వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.
News February 27, 2026
BREAKING.. డీజీపీ శివధర్ రెడ్డి ఖమ్మం పర్యటన రద్దు

డీజీపీ శివధర్ రెడ్డి నేటి ఖమ్మం పర్యటన అనివార్య కారణాలతో రద్దయింది. కొత్త పోలీస్ భవనాల ప్రారంభోత్సవం, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పర్యటన మళ్లీ ఎప్పుడు ఉండేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.


