News December 16, 2025

ఏప్రిల్ నుంచి పెన్షన్ల పెంపు?

image

TG: వచ్చే ఏడాది APR నుంచి పెన్షన్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వృద్ధ్యాప్య, వితంతు తదితర పెన్షనర్లు 44లక్షల మంది ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో వారికోసం ₹11,635Cr కేటాయించింది. పెంపు జరిగితే ₹22K Cr కావాల్సి ఉండగా నిధుల సమీకరణ మార్గాలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. ఒకేసారి పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగా అమలు చేయనుంది. ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ ₹2,016 ఇస్తుండగా హామీ మేరకు ₹4వేలు చేయాల్సి ఉంది.

Similar News

News December 17, 2025

8,113పోస్టులు.. CBAT షెడ్యూల్ విడుదల

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గతేడాది విడుదల చేసిన 8,113 <>NTPC<<>> పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ అందించింది. డిసెంబర్ 15న సీబీటీ 2 ఫలితాలు విడుదల చేయగా.. తాజాగా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్(CBAT)ను డిసెంబర్ 28న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు వెబ్‌సైట్ నుంచి తీసుకోవచ్చని తెలిపింది. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in

News December 17, 2025

బుల్లెట్ రైలు ట్రాక్ కోసం Soil Test!

image

AP: బెంగళూరు-HYD, HYD-చెన్నై మార్గాల్లో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. HYD-చెన్నై మార్గం గుంటూరు జిల్లా.. బెంగళూరు-HYD మార్గం అనంతపురం జిల్లా మీదుగా వెళ్తుంది. ఇందులో భాగంగా నిన్న అనంతపురం(D) బుక్కరాయసముద్రం ఏరియాలో భూపరీక్షలు నిర్వహించింది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు సిద్ధం చేస్తున్న గ్రౌండ్ రిపోర్టులో భాగంగానే భూపరీక్షలు చేసినట్లు తెలుస్తోంది.

News December 17, 2025

కౌలు రైతులకు రూ.లక్ష రుణం, ఎవరికి రాదు?

image

AP: ప్రభుత్వం భూమి లేని పేదలకు వ్యవసాయం కోసం ఇచ్చే దారకస్తు భూమి(DKT), అసైన్డ్‌ భూములు సాగు చేస్తూ కౌలు పత్రం ఉన్నవారు ఈ రుణానికి అనర్హులు. అలాగే సాగు చేసే భూమి ఎకరా కంటే తక్కువ ఉండకూడదు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో నివాసం లేని వారు, సభ్యత్వం లేని వారికి రుణం రాదు. సొంత ఇల్లు ఉన్నవారికే రుణాల మంజూరులో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. త్వరలో ఈ నిబంధనలపై పూర్తి క్లారిటీ రానుంది.