News March 30, 2026
ఏప్రిల్ 1న నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన

వింజమూరు మండలంలో ఏప్రిల్ 1వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు వింజమూరు చేరుకోనున్న సీఎం, ముందుగా నార్త్ ఎస్సీ కాలనీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పాతూరు చెరువు బండ వద్ద లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడి, మధ్యాహ్నం ప్రజా వేదిక బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Similar News
News April 20, 2026
బసవేశ్వరుడికి నెల్లూరు కలెక్టర్ నివాళులు

నెల్లూరు కలెక్టరేట్లో మహాత్మా బసవేశ్వర జయంతి సోమవారం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్ తదితరులు బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బసవేశ్వర గొప్ప సామాజిక సంస్కర్త, తత్వవేత్త, కవి అన్నారు. కుల, లింగ వివక్షతను వ్యతిరేకిస్తూ సమసమాజ నిర్మాణం కోసం కృషి చేశారని కొనియాడారు.
News April 20, 2026
ఫలించిన నెల్లూరు కలెక్టర్ ప్రయత్నం

నెల్లూరు ఇన్ఛార్జ్ DPO వసుమతికి ఇటీవలే సీఈవోగా ప్రమోషన్ లభించింది. ఆ తర్వాత ఆమెను తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. నెల్లూరు జిల్లాలోనే ఆమెకు బాధ్యతలు ఇవ్వాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆ శాఖ రాష్ట్ర కమిషనర్కు లేఖ రాశారు. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమెను నెల్లూరు జిల్లా స్వర్ణ గ్రామ/వార్డు అధికారిణిగా నియమించారు.
News April 20, 2026
BREAKING: నెల్లూరులో ఘోర ప్రమాదం

నెల్లూరు సిటీలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ముత్తుకూరు రోడ్డు వడ్డిపాలెం సమీపంలో స్కూటీని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు చక్రాల కింద పడటంతో స్పాట్లోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్కూటీ నంబర్ AP40KK6649 ఆధారంగా మృతుల వివరాలు సేకరిస్తున్నారు.


