News March 28, 2025

ఏప్రిల్ 1న పదో తరగతి సోషల్ పరీక్ష: విశాఖ డీఈవో

image

రంజాన్ మార్చి 31న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఈవో ప్రేమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. అయితే పదో తరగతి సోషల్ పరీక్ష మార్చి 31వ తేదీన నిర్వహించనున్నట్లు ముందు హల్ టికెట్స్‌లో ప్రచురితం చేశారని, రంజాన్ పండుగ కావడంతో ఏప్రిల్ 1న పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలన్నారు.

Similar News

News March 31, 2025

విశాఖలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్

image

విశాఖలో మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. వేపగుంటలో ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ ప్రభుత్వ అండతో కబ్జా చేసి భవనాలు నిర్మించారని రేపర్తి రాజు విజ్ఞప్తి చేశారు. సుజాత నగర్ టీచర్స్ లేఅవుట్‌లో 150 గజాల స్థలాన్ని ఆక్రమించారని లక్ష్మి అనే మహిళ వినతి అందించారు.

News March 31, 2025

విశాఖలో ఐదేళ్ల బాలిక పట్ల పీటీ అసభ్యకర ప్రవర్తన

image

విశాఖలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మాస్టారే చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మధురవాడ పరిధిలో జరిగింది. వాంబే కాలనీలోని ఓ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పీటీగా పనిచేస్తున్న రామచంద్రరావు ఐదేళ్ల చిన్నారి పట్ల అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆ చిన్నారి భయపడి తల్లిదండ్రులకు, టీచర్లకు చెప్పింది. వెంటనే వీరు పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పీటీని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

News March 31, 2025

విశాఖ: మహిళను నిండా ముంచిన రాంగ్ కాల్

image

శ్రీకాళహస్తికి చెందిన B.అక్షయ్ విశాఖకు చెందిన మహిళ(35)కు రాంగ్ కాల్ ద్వారా పరిచయమయ్యాడు. ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతంగా మెసేజ్‌లు చేశాడు. కొంతకాలం తర్వాత మెసేజ్‌లు ఆమె భర్తకు పంపిస్తానని బ్లాక్‌మెయిల్ చేసి రూ.10లక్షలు దోచేశాడు. ఆమెపై లైంగిక దాడి చేసి ఆ దృశ్యాలను రికార్డ్ చేసి వేధించాడు. చివరకు మహిళ భర్త సాయంతో త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు.

error: Content is protected !!