News January 8, 2026

ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలిదశ

image

దేశంలో ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలిదశ ప్రారంభం కానుంది. ఇందులోభాగంగా ఇళ్ల లిస్టింగ్ జరుగుతుందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుందని చెప్పింది. ప్రతి రాష్ట్రానికి 30రోజుల వ్యవధి ఉంటుందని తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెండో విడతలో జనాభా లెక్కలు సేకరించనుంది. ఇది 2027 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇందుకోసం కేంద్రం ₹11,718 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది.

Similar News

News February 11, 2026

SBI సరికొత్త రికార్డు!

image

బ్యాంకింగ్ దిగ్గజం SBI సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ విలువలో తొలిసారి ₹10 లక్షల కోట్ల మార్కును దాటింది. రిలయన్స్, HDFC, ఎయిర్‌టెల్, TCS, ICICI బ్యాంక్ తర్వాత ఈ ఘనత అందుకున్న ఆరో కంపెనీగా నిలిచింది. అత్యంత విలువైన కంపెనీల్లోనూ ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు SBI షేరు నిన్న ₹1,154తో ఆల్ టైమ్ హై అందుకుంది. ఏడాదిలో 67.5% ఎగిసింది. ఇందులో వాటాలున్న LICకి ₹40 వేల కోట్ల లాభం రావడం గమనార్హం.

News February 11, 2026

మనస్సును ప్రశాంతంగా మార్చే భైరవీ ముద్ర

image

సుఖాసనంలో కానీ పద్మాసనం/వజ్రాసనంలో కూర్చోవాలి. నడుం వంగకుండా నిటారుగా ఉండేలా చూడాలి. రెండు చేతులను ఒళ్లో ఉంచి ఒక అరచేతిలో ఇంకో అరచేయి పెట్టి ఉంచాలి. కుడి చేయి పైన , ఎడమ చేయి కింద ఉండేవిధంగా చూసుకోవాలి. కళ్లు మూసుకుని నెమ్మదిగా శ్వాసతీసుకుని వదులుతూ శ్వాసమీద ధ్యాసను ఉంచాలి. కనీసం 7నిమిషాల సమయం ఈ భైరవి ముద్రలో ఉంటే మనస్సు ప్రశాతంగా ఉంటుందంటున్నారు నిపుణులు.

News February 11, 2026

మొక్కజొన్నను ఆశించే తెగుళ్లు – నివారణ

image

మొక్కజొన్న నాటిన 30 రోజుల దశలో పేనుబంక ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ml, ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. నల్లులు ఆశించకుండా పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నల్లులు ఆశిస్తే లీటరు నీటిలో డైకోఫాల్ 50mlను కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 1ml వేప నూనెను 5 గ్రాముల సబ్బుపొడిలో కలిపి పిచికారీ చేయాలి.