News February 21, 2026

ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు: సంగారెడ్డి డీఈవో

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని స్కూల్స్‌లో 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు ఎస్ఎ-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాల విద్యాశాఖ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిందన్నారు. ఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు.

Similar News

News February 21, 2026

GNT: మెడికల్ ఎగ్జిబిషన్.. ఈ నెల 28 వరకు పొడిగింపు

image

గుంటూరు మెడికల్ కాలేజీలో 30 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న మెడికల్ ఎగ్జిబిషన్‌ను ప్రజల విజ్ఞప్తితో ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు. ఇకపై మరింత గడువు లేదని ప్రిన్సిపల్ డా. సుందరాచారి స్పష్టం చేశారు. వేలాది మంది ఇప్పటికే సందర్శించారు. ఎండల దృష్ట్యా తాగునీరు, శౌచాలయాల వంటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విదేశీ యువతి ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించడం ఆకట్టుకుంది.

News February 21, 2026

నక్సల్స్ మాదిరిగానే చొరబాటుదారులను ఏరివేస్తాం: అమిత్ షా

image

అక్రమ వలసదారులను ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచి కూడా తొలగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నక్సల్స్ మాదిరిగానే చొరబాటుదారులనూ మరో ఐదేళ్లలో ఏరివేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అస్సాంలోని కామ్‌రూప్‌లో ఆయన మాట్లాడారు. ‘అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని రాహుల్ చెప్పారు. కానీ ఆ పని చేయరు. ఎందుకంటే వారే ఆ పార్టీకి ఓటు బ్యాంక్. INC విధానాలు అస్సాంకు ముప్పుగా మారాయి’ అని ఆరోపించారు.

News February 21, 2026

HYD: TG EAPCET పరీక్షకు 20వేల దరఖాస్తులు

image

TG EAPCET ప్రవేశ పరీక్షకి ఈ రోజు ఇంజినీరింగ్ విభాగానికి 12,770 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి 7,354 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2 విభాగాలకు సంబంధించి 19 మంది దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు వరకు 20,143 దరఖాస్తుకు వచ్చాయని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.