News April 9, 2025
ఏప్రిల్ 10 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
Similar News
News November 7, 2025
జాతీయ ఫుట్బాల్ టోర్నీకి గజ్వేల్ విద్యార్థి ఎంపిక

SGF జాతీయస్థాయి ఫుట్బాల్ క్రీడలకు గజ్వేల్కు చెందిన హర్షవర్ధన్ ఎంపికయ్యాడు. వికారాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-14 ఫుట్బాల్ టోర్నీలో ప్రజ్ఞాపూర్ విద్యార్థి అయిన హర్షవర్ధన్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. చివరి మ్యాచ్లో నిజామాబాద్పై గోల్ చేసి మెదక్ జట్టును గెలిపించాడు. ఈ ప్రతిభతో హర్షవర్ధన్ జాతీయస్థాయి టోర్నమెంట్కు సెలక్ట్ అయ్యాడు.
News November 7, 2025
ధర్మారం: దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్

ధర్మారం కటికెనపల్లికి చెందిన బోనగిరి వెంకటేశం ఇంట్లో జరిగిన చోరీ కేసులో గడమల్ల సదన్ కుమార్(19)ను అరెస్ట్ చేసినట్లు SI ప్రవీణ్ తెలిపారు. వెంకటేశం OCT 25న ఇంటికి తాళం వేసి వెళ్లాడు. బుధవారం ఇంటికొచ్చే సరికి చోరీ జరిగిందని గుర్తించి PSలో ఫిర్యాదు చేశాడు. విచారణలో సదన్ చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బంగారు, వెండి నగలు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్ చేసినట్లు SI చెప్పారు.
News November 7, 2025
భద్రాద్రి కలెక్టరేట్లో జాతీయ గీతాలాపన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యా చందన పాల్గొని వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా దేశభక్తి, ఐక్యతను ప్రతిబింబించే ఈ గేయం భారత స్వాతంత్య్ర సమరంలో పోషించిన విశిష్ట పాత్రను అధికారులు స్మరించుకున్నారు.


