News April 14, 2025
ఏప్రిల్ 16న గుంటూరులో మిర్చి రైతుల నిరసన

పేరేచర్లలో మిర్చి సాగు చేసిన కౌలు రైతులు దిగుబడి తక్కువగా రావడంతో అధిక నష్టాలు భరిస్తున్నారు. మార్కెట్లో ధరలు పడిపోవడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. మద్దతు ధర ప్రకటించినా, కొనుగోలు ప్రక్రియ లేదు. రైతులు బోనస్ ఇవ్వాలని, రూ.15,000కి క్వింటాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 16న గుంటూరులో నిరసన నిర్వహించనున్నారు.
Similar News
News April 15, 2025
గుంటూరు: 22 కేసుల్లో ముద్దాయి అరెస్ట్

2019 నుంచి గుంటూరు, నంద్యాల జిల్లాల్లో దారిదోపిడులు, దొంగతనాలు చేస్తున్న చెంచు హనుమంతును ఎట్టకేలకు నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సుగాలిమెట్ట సమీపంలోని జంబులమ్మ గుడివద్ద పట్టుకున్న సమయంలో అతని వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న హనుమంతుతో పాటు అతడి ముఠా సభ్యులపై 22 కేసులు నమోదై ఉన్నట్లు ఎస్పీ అదిరాజ్ సింగ్ వెల్లడించారు.
News April 15, 2025
గర్భిణీలు ఫోన్ వస్తే లిఫ్ట్ చెయ్యండి: DMHO

గుంటూరు DMHO కాన్ఫరెన్స్ హాలులో Dr. K. విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం ఆశా నోడల్ ఆఫీసర్స్ సమావేశం జరిగింది. DMHO మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కిల్కారి ప్రోగ్రామ్ను గర్భిణీ, బాలింతల కోసం ప్రవేశ పెట్టిందన్నారు. గర్భిణీకి 4నెల నుంచి బిడ్డకు ఒక సంవత్సవరం వచ్చే వరకు కిల్కారి ఫోన్ కాల్స్ (01244451660/14423) లిఫ్ట్ చేస్తే పూర్తి సమాచారాన్ని వినగలుగుతారన్నారు. ఈ సేవలను బాలింతలు ఉపయోగించుకోవాలని కోరారు.
News April 15, 2025
గుంటూరు: 22 కేసుల్లో ముద్దాయి అరెస్ట్

2019 నుంచి గుంటూరు, నంద్యాల జిల్లాల్లో దారిదోపిడులు, దొంగతనాలు చేస్తున్న చెంచు హనుమంతును ఎట్టకేలకు నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సుగాలిమెట్ట సమీపంలోని జంబులమ్మ గుడివద్ద పట్టుకున్న సమయంలో అతని వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న హనుమంతుతో పాటు అతడి ముఠా సభ్యులపై 22 కేసులు నమోదై ఉన్నట్లు ఎస్పీ అదిరాజ్ సింగ్ వెల్లడించారు.