News March 27, 2025
ఏప్రిల్ 3న వేములవాడకు రానున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

ఏప్రిల్ 3వ తేదీన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఐదుగురు సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలా దేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట ప్రవీణ్ వచ్చే నెల 3వ తేదీన జిల్లాలోని వేములవాడకు సాయంత్రం చేరుకుంటారు. 4వ తేదీన ఉదయం 6 గంటలకు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
Similar News
News February 26, 2026
హన్మకొండ: 98 శాతం మంది విద్యార్థుల హాజరు

జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షకు తొలి రోజు గురువారం 98 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్, వొకేషనల్ కలిసి మొత్తం 18,768 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్ట్ డే ఎగ్జామ్కు 18,375 మంది విద్యార్థులు హాజరయ్యారు. 393 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ ఘటనలు చోటు చేసుకోలేదని అధికారులు వెల్లడించారు.
News February 26, 2026
యువతకు రుణాల మంజూరు వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

ములుగు జిల్లా కలెక్టరేట్లో జరిగిన బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీహెచ్ మహేందర్ జీ పాల్గొన్నారు. బ్యాంకులు నిర్దేశించిన రుణ లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. మహిళా సంఘాలు, వయోవృద్ధుల సంఘాలు, నిరుద్యోగ యువతకు రుణాల మంజూరు వేగవంతం చేయాలని కోరారు. 2026-27 ఆర్థిక సంవత్సర ప్రొజెక్షన్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ బుక్ను ఆవిష్కరించారు.
News February 26, 2026
తాళికట్టు శుభవేళ.. రష్మిక ఆనందబాష్పాలు

ఏ ఆడపిల్లకైనా వివాహమనేది జీవితంలో మధురమైన ఘట్టం. హీరోయిన్ రష్మిక మందన్న కూడా చిన్న కుటుంబం నుంచి నేషనల్ క్రష్ స్థాయికి చేరుకొని ఇప్పుడు విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్నారు. జీవితాంతం తోడుంటానంటూ అగ్నిసాక్షిగా విజయ్ తన మెడలో తాళికట్టిన శుభవేళ రష్మిక కళ్లలో నీళ్లు తిరిగాయి. తన ఆనందాన్ని కన్నీళ్ల రూపంలో వ్యక్తపరిచిన ఫొటో పైన చూడవచ్చు.


