News March 27, 2025

ఏప్రిల్ 3న వేములవాడకు రానున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

image

ఏప్రిల్ 3వ తేదీన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఐదుగురు సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలా దేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట ప్రవీణ్ వచ్చే నెల 3వ తేదీన జిల్లాలోని వేములవాడకు సాయంత్రం చేరుకుంటారు. 4వ తేదీన ఉదయం 6 గంటలకు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

Similar News

News December 24, 2025

కేజీ రూ.3,00,000.. ఎంతో దూరం లేదు!

image

బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. కేజీ సిల్వర్ రేటు ఈ ఏడాది జనవరిలో రూ.90వేలు ఉండగా ఏకంగా రూ.1.54 లక్షలు పెరిగి రూ.2,44,000కు చేరింది. ఇదే జోరు కొనసాగితే కిలో రూ.3లక్షలకు చేరడానికి ఇక ఎంతో కాలం పట్టదని నిపుణులు చెబుతున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,38,930 ఉండగా అతి త్వరలోనే రూ.1,50,000 మార్క్ చేరొచ్చని అంచనా వేస్తున్నారు. మీరేమంటారు?

News December 24, 2025

H-1B వీసా కొత్త రూల్: ఎవరికి లాభం?

image

H-1B వీసాల జారీలో ఏళ్లుగా అనుసరిస్తున్న లాటరీ సిస్టమ్‌ను ఆపేసి మంచి స్కిల్స్ ఉండి అధిక వేతనం వచ్చే వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2026 నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డాక్టర్ల వంటి హైస్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు ప్రాముఖ్యత ఇస్తారు. తక్కువ జీతం ఉండే అన్‌స్కిల్డ్ వర్క్ కోసం US వెళ్లాలనుకునే వారికి అవకాశాలు తగ్గొచ్చు. కంపెనీలు తక్కువ జీతం కోసం కాకుండా టాలెంట్ ఉన్నవారికే వీసాలు ఇచ్చేలా ఈ మార్పులు చేశారు.

News December 24, 2025

HYD: 2025లో ‘550’.. గుర్తుందా?

image

NEW YEAR సెలబ్రేషన్ అంటే సిటీలో బట్టలు చింపుకోవాల్సిందే. ఏజ్‌తో సంబంధం లేకుండా చిల్ అవుతుంటారు. ఏదైనా ఒక మోతాదు వరకు అంటే ఓకే. కానీ, 2025 న్యూ ఇయర్ మీకు గుర్తుందా?. ఓ మందుబాబు పీకలదాకా తాగి పోలీసులకు చిక్కాడు. పంజాగుట్టలో బైకర్‌ను ఆపి బ్రీత్ అనలైజర్‌ టెస్ట్ చేయగా ఏకంగా 550 రీడింగ్ నమోదైంది. ఇది చూసి పోలీసులే షాకయ్యారు. న్యూ ఇయర్ రోజే మందుబాబు ఫొటో వైరలైంది. చిల్ అవ్వండి బ్రో.. చిల్లర అవ్వకండి.