News August 30, 2024

ఏయూలో ఎంబ్రియాలజీ కోర్సు ప్రారంభం

image

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాలలో నూతనంగా మాస్టర్స్ ఇన్ క్లినికల్ ఎంబ్రియాలజీ కోర్సును వీసీ ఆచార్య జి.శశిభూషణరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఎంబ్రియాలజీ నిపుణుల అవసరం పెరుగుతోందని అన్నారు. సమాజ అవసరాలు, ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఎంతో ప్రాధాన్యత కలిగిన ఇటువంటి కోర్సును ప్రారంభించడం పట్ల వీసీ కళాశాల ఆచార్యులను అభినందించారు.

Similar News

News November 12, 2025

విశాఖ: ఈనె 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

image

విశాఖలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు.14న బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శన, 16న చిత్రలేఖనం,17న వకృత్వ పోటీలు,18న సభ్యత్వ సేకరణ, 19న ఇందిరాగాంధీ జయంతి, మ్యూజికల్ చైర్ పోటీలు, 20న గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు విజేతలకు బహుమతులు ఇవ్వనున్నారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు గ్రంథాలయ అధికారులు తెలిపారు.

News November 12, 2025

విశాఖ: ‘వాహనదారులు నిబంధనలు పాటించాలి’

image

ఆటోరిక్షాలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, స్కూల్ పిల్లలను ఆరుగురుకి మించి తీసుకెళ్లకూడదని ఉప రవాణా కమీషనర్ ఆర్.సి.హెచ్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. CC బస్సులో, టూరిస్ట్ బస్సులలో అత్యవసర ద్వారానికి అడ్డంగా టైర్లు, లగేజిలు ఉంచకూడదన్నారు. విశాఖలో పార్ట్నర్‌షిప్ సమ్మిట్ జరుగనున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా వాహనాలను నడపాలని సూచించారు.

News November 12, 2025

న్యుమోనియా లక్షణాలు ఇవే: DMHO

image

నేటి నుంచి ఫిబ్రవరి 28వరకు అన్ని ఆరోగ్య కేంద్రాలలో సాన్స్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు DMHO జగదీశ్వరరావు తెలిపారు. ఈ సాన్స్ ప్రోగ్రాం ద్వారా పిల్లలలో న్యుమోనియా లక్షణాలు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రతలు, వైద్యం గూర్చి నిర్వహించనున్నారు. దగ్గు, జలుబు ఎక్కువ రావటం, అధిక జ్వరం, శ్వాస తీసుకొనే సమయంలో డొక్కలు ఎగురవేయటం లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.