News October 3, 2024

ఏయూలో డిప్లొమో కోర్సులకు నోటిఫికేషన్

image

ఏయూలో డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ డి.ఏ నాయుడు ప్రకటనలో తెలిపారు. ఏడాది కాల వ్యవధిలో నటన, దర్శకత్వం, లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం, తాళ వాయిద్యం కోర్సుల్లో, ఆరు నెలలకు యోగా, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, ఫొటోగ్రఫీ, స్పానిష్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 21లోగా దరఖాస్తు చేయాలి, 23న కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. >Share it

Similar News

News October 7, 2024

విశాఖ: డిప్యూటీ సీఎంతో ముగిసిన భేటీ

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో విశాఖ ఉక్కు పోరాట కమిటీ నాయకుల భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయమని కార్మికులు డిమాండ్ చేశారు. ఉక్కు కర్మాగారంలో జరుగుతున్న పరిణామాలను డ్రాఫ్ట్ రూపంలో కార్మిక సంఘాల నాయకుల పవన్ కళ్యాణ్‌కు అందజేశారు.

News October 6, 2024

విశాఖ: Pic oF The Day

image

విశాఖ కుర్రోడు నితీశ్ కుమార్ రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. ఐపీఎల్‌లో అదరగొట్టిన నితీశ్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ-20 సీరిస్‌కు ఎంపికయ్యారు. ఆదివారం జరుగుతున్న తొలి మ్యాచ్‌‌తో అరంగేట్రం చేశారు. టీం సభ్యుల మధ్య టీం ఇండియా క్యాప్ అందుకున్నారు. అతనితో పాటు మయాంక్ యాదవ్‌కు కూడా ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో వీరిద్దరూ టీం ఇండియా క్యాప్‌లతో ఫొటోలు తీసుకున్నారు.

News October 6, 2024

ఇబ్బంది కలగకుండా ఇసుక బుకింగ్ విధానం: కలెక్టర్

image

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇసుక బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. వార్డు గ్రామ సచివాలయం ద్వారా ఇసుక బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. గత నెల 29 నుంచి ఇప్పటివరకు 442 మంది ఇసుక బుకింగ్ చేసుకోగా 357మందికి ఏడు వేల మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేశామన్నారు. ప్రజలే ఇసుకను రవాణా చేసుకునే విధంగా కూడా అవకాశం కల్పించామన్నారు.