News October 8, 2024

ఏయూ: ఎం.ఏ పాలి బుద్ధిజంలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా విభాగంలో శ్రీలంకకు చెందిన జయవర్ధనపుర యూనివర్సిటీతో నిర్వహిస్తున్న పాలి బుద్ధిస్ట్ స్టడీస్ ఎం.ఏ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ డీ.ఏ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ కోర్సులో చేయడానికి అర్హులు. ఈనెల 24వ తేదీలోగా ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. 25న అడ్మిషన్ల కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.

Similar News

News October 8, 2024

డిసెంబర్‌లో విశాఖ రైల్వే‌జోన్‌కు శంకుస్థాపన..!

image

కేంద్ర రైల్వే మంత్రి, సీఎం చంద్రబాబు భేటీలో విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. డిసెంబరు కల్లా కొత్త రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. విభజన హామీలో భాగంగా వాల్తేరు డివిజన్‌ను యథావిధిగా ఉంచాలని కోరినట్లు సమాచారం. అలాగే విశాఖ-అమరావతి మధ్య కొత్త రైల్వేలైన్‌‌ ఏర్పాటు, నమోభారత్‌ కింద విశాఖ-నెల్లూరు మధ్య రైలు అనుసంధానం మెరుగుపరచాలని కోరారు.

News October 8, 2024

విశాఖ-శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ మధ్య ప్రత్యేక రైళ్లు

image

పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం-శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ల మధ్య 08529, 08530 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైళ్లు అక్టోబర్ 10 నుంచి 16 వరకు తిరగనున్నాయని విశాఖ రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు విశాఖపట్నం-శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు.

News October 8, 2024

విశాఖలో కార్పొరేటర్‌పై రౌడీ షీట్

image

జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేశ్‌పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. వైసీపీకి చెందిన సురేశ్‌పై అనేక కేసులు నమోదు అయినట్లు మల్కాపురం పోలీసులు తెలిపారు. సొంత పార్టీ నాయకుల ఫిర్యాదుతోనే నాలుగు కేసులు ఆయనపై నమోదయ్యాయి. దురుసుగా ప్రవర్తించడం, దుర్భాషలాడడంతో ఆయనపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.