News October 8, 2025

ఏయూ: పీజీ, పీజీ డిప్లమో సెల్ఫ్ సపోర్ట్ కోర్సులకు ప్రవేశాలు

image

ఏయూ నిర్వహిస్తున్న వివిధ పీజీ, పీజీ డిప్లమో సెల్ఫ్ సపోర్ట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సంచాలకులు డి.ఏ.నాయుడు తెలిపారు. మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పీజీ డిప్లమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కలవు. దరఖాస్తు, ఫీజుల వివరాలు, ప్రవేశాలు, అర్హత వివరాలు ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

Similar News

News October 8, 2025

జగన్ పర్యటనలో మార్పులు: గుడివాడ అమర్నాథ్

image

మాజీ సీఎం జగన్ విశాఖ పర్యటనలో మార్పులు జరిగాయని, ఆయన కేజీహెచ్‌లో కురుపాం విద్యార్థులను పరామర్శిస్తారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు అనుమతులపై డ్రామా సృష్టిస్తూన్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి భయపడి ఫ్లెక్సీలు తొలగిస్తూ, ఆంక్షలతో పర్యటనను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

News October 8, 2025

జగన్ విశాఖ పర్యటన ఒక జగన్నాటకం: ప్రణవ్ గోపాల్

image

మాజీ సీఎం జగన్ విశాఖ పర్యటన అల్లర్లు సృష్టించడానికేనని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ విమర్శించారు. మెడికల్ కాలేజీలను మధ్యలోనే వదిలేసి, నిధులను పార్టీ ఆఫీసులకు మళ్లించారని ఆయన ఆరోపించారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టడంపై ఉన్న శ్రద్ధ కాలేజీలపై లేదన్నారు. డాక్టర్ సుధాకర్ మృతికి, బీసీ నేతల వేధింపులకు కారణమైన జగన్‌కు ఉత్తరాంధ్రలో పర్యటించే అర్హత లేదని మండిపడ్డారు.

News October 8, 2025

వాల్తేర్ డివిజన్ ఏడీఆర్ఎంగా బాధ్యతలు స్వీకరించిన కుందు రామరావు

image

వాల్తేర్ డివిజన్ ఏడీఆర్ఎంగా కుందు రామరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 2006 IRSE బ్యాచ్‌కు చెందిన కుందు రామారావు భారత రైల్వేలోని వివిధ జోన్‌లలో కీలక హోదాల్లో సేవలందించారు. నాగ్‌పూర్‌లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్‌గా, రాయ్‌పూర్‌లో సీనియర్ ఏడీఈఎన్‌గా, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని బిలాస్‌పూర్‌లో సీనియర్ డివిజనల్ ఇంజినీర్‌గా, విజయవాడలో సీనియర్ డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేశారు.