News March 2, 2025

ఏలూరును ఉలిక్కిపడేలా చేసిన చిన్నపిల్లల విక్రయాలు

image

ఇతర రాష్ట్రాల నుంచి చిన్నపిల్లలను తీసుకువచ్చి విజయవాడ, ఏలూరు ప్రాంతాలలో అమ్మకాలు జరిపే ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ ప్రకాష్ నగర్‌కు చెందిన సరోజినీ ఆధ్వర్యంలో ఒక ముఠా ఏలూరులో ముగ్గురు పిల్లలను అమ్మినట్లు తెలియటంతో పోలీసు బృందాలు చేరుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. ఆడ శిశువు రూ.3 లక్షలు, మగ శిశువుని రూ.5 లక్షలకు ఈ ముఠా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

Similar News

News November 4, 2025

మందమర్రి: ‘మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలి’

image

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ బోర్డు నిర్వహించకుండా కార్మికులను అయోమయానికి గురి చేస్తోందని టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు విమర్శించారు. అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సింగరేణి కుటుంబాల్లో వెలుగులు నింపిన దేవుడన్నారు. కారుణ్య నియామకాల ద్వారా 19 వేల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణిలో కార్మికులకు ఉద్యోగ భద్రత కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు.

News November 4, 2025

‘ఇండియా’ గ్లోబల్ సూపర్ పవర్: ఇజ్రాయెల్ మంత్రి

image

ఇండియా ‘గ్లోబల్ సూపర్ పవర్’ కంట్రీ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సర్ అభివర్ణించారు. 2 దేశాల సంబంధాలు గతంలో కన్నా మరింత బలపడ్డాయని NDTVతో చెప్పారు. డిఫెన్స్, ట్రేడ్, కౌంటర్ టెర్రరిజమ్, ట్రేడ్‌లలో తమ బంధాన్ని విస్తరించామన్నారు. హమాస్ దాడి సమయంలో మద్దతుగా నిలిచిన ఇండియాను ఎప్పుడూ గుర్తుంచుకుంటామని తెలిపారు. తమకు ముప్పుగా ఉన్న పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించలేమన్నారు.

News November 4, 2025

మంచిర్యాల జిల్లా జట్టుకు మొదటి స్థానం

image

దండేపల్లి మండలం రెబ్బనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి SGF అండర్-14 వాలీబాల్ పోటీల్లో మంచిర్యాల జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో 4 జిల్లాల నుంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట స్థాయికి పోటీలకు ఎంపిక చేసినట్లు SGF సెక్రటరీ యాకూబ్ తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.