News January 15, 2026
ఏలూరులో ఎండ్ల బండిపై ఎస్పీ దంపతుల సందడి

ఏలూరులో పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో సంక్రాంతి సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ప్రతాప శివ కిషోర్, ఆయన సతీమణి ధాత్రి రెడ్డి (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో) దంపతులు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి, చిన్నారులకు భోగి పళ్లు పోశారు. అనంతరం పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఎడ్లబండిపై విహరించి అందరినీ అలరించారు. ఈ వేడుకల్లో పోలీసు కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
Similar News
News February 10, 2026
‘కవిత్వం నేర్చుకుంటా’.. ఆంథ్రోపిక్ ఇంజినీర్ రాజీనామా!

<<19068101>>టెక్ సంచలనం<<>> ‘ఆంథ్రోపిక్’లో ఏఐ సేఫ్టీ ఇంజినీర్ మృణాంక్ శర్మ రాజీనామా కలకలం రేపింది. ‘AI, బయో వెపన్లతోనే కాదు.. ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యే సంక్షోభాల వల్ల కూడా ప్రపంచం ప్రమాదంలో ఉంది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే సామర్థ్యానికి సమానంగా మన జ్ఞానం పెరిగినట్లుగా కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. విలువలను కోల్పోతున్నామని, ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నామని రాసుకొచ్చారు. కవిత్వంలో డిగ్రీ చేస్తానని తెలిపారు.
News February 10, 2026
చిన్నారి ప్రాణం తీసిన బాటిల్ మూత.. తల్లిదండ్రులారా జాగ్రత్త!

పలానా వస్తువు గొంతులోకి వెళ్తే ప్రమాదమని పసి పిల్లలకేం తెలుసు. కనిపించిందల్లా నోట్లో పెట్టుకుంటారు. అప్పుడప్పుడు ఇలాంటివి విషాదాలుగా మారుతాయి. అందుకే తల్లిదండ్రులే అప్రమత్తంగా ఉంటూ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. తాజాగా యాదాద్రి(D) భూదాన్(M) ఇంద్రియాలలో 18 నెలల భవ్యశ్రీ ఆడుకుంటూ కూల్ డ్రింక్ మూత మింగింది. గొంతులో ఇరుక్కోవడంతో చనిపోయింది. అందుకే పిల్లలకు మూతలు, నాణేలు వంటివి దూరంగా ఉంచాలి.
News February 10, 2026
హోం క్లీనింగ్ టిప్స్..

* ఓవెన్లో వెనీలా ఎసెన్స్ ఉంచి కొద్దిసేపు వేడి చేస్తే లోపలి దుర్వాసనలు దూరమవుతాయి. * నూనె డబ్బాల మీద బంగాళా దుంప ముక్కలతో రుద్దితే తుప్పు మరకలు అంటుకోకుండా ఉంటాయి. * రెండు కప్పుల నీటిలో పావుకప్పు వెనిగర్, నాలుగు చుక్కలు పాత్రలు తోముకునే సబ్బు నీళ్ళు కలిపి, దానిలో ముంచిన వస్త్రంతో కిటికీలను తుడిస్తే పేరుకున్న దుమ్ముపోతుంది. * వెండి వస్తువుల గార పోవాలంటే పచ్చిపాలతో రుద్ది కడగాలి.


