News February 6, 2025

ఏలూరులో ఒక్కే ఒక్క నామినేషన్

image

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో బుధవారం భీమడోలుకు చెందిన బాలాజీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు కలెక్టరేట్లో ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె.వెట్రిసెల్వికి ఓ సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అభ్యర్ధి బాలాజీతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు.

Similar News

News November 10, 2025

ఢిల్లీ ఘటన.. ఉమ్మడి పాలమూరులో విస్తృత తనిఖీలు

image

ఢిల్లీ పేలుళ్ల ఘటన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా పోలీసులు అప్రమత్తమై, విస్తృత తనిఖీలు చేపట్టారు. జాతీయ రహదారులు, రాష్ట్ర సరిహద్దులైన గద్వాల జిల్లా అలంపూర్, నారాయణపేట జిల్లా కృష్ణ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అనుమానాస్పద వస్తువులపై దృష్టి సారించి తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.

News November 10, 2025

యాదాద్రి: మధ్యాహ్న భోజనం తనిఖీ చేయనున్న అధికారులు

image

ఈనెల 11, 13న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఎంపిక చేసిన అధికారులచే మధ్యాహ్న భోజనంతో పాటు పాఠశాల పరిసరాలను, మూత్రశాలలను పర్యవేక్షించాలని సూచించారు. పర్యవేక్షించిన అంశాలను చెక్ లిస్ట్ రూపంలో నమోదు చేసి జిల్లా కార్యాలయానికి పంపాలని తెలిపారు.

News November 10, 2025

శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యితో రూ. 251 కోట్ల దోపిడి: పట్టాభి

image

ధనదాహంతో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేస్తారా అని TDP నేత పట్టాభిరామ్ ప్రశ్నించారు. YCP హయాంలో TTD ఛైర్మన్‌లుగా పనిచేసిన జగన్ బంధువులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. YV సుబ్బారెడ్డి హయాంలో ‘భోలే బాబా’ కంపెనీ 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసి రూ. 251 కోట్లు దోచుకుందని ఆరోపించారు. అంతేకాకుండా పామాయిల్ పేరుతో ఫేక్ బిల్లులు సృష్టించి రసాయనాలతో నెయ్యి తయారు చేశారన్నారు.