News April 7, 2024
ఏలూరులో ‘టిల్లు స్క్వేర్’ మూవీ టీం సందడి

ఏలూరులోని వి-మాక్స్ థియేటర్లో ఆదివారం ‘టిల్లు స్క్వేర్’ మూవీ టీం సందడి చేసింది. ఈ మూవీ విడుదలై మంచి టాక్తో దూసుకుపోతుంది. రూ.100 కోట్లు వసూలు చేసిన సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో జొన్నలగడ్డ సిద్ధూ మాట్లాడుతూ.. మూవీకి ఇంతటి ఘనవిజయం చేకూర్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానన్నారు. డైరెక్టర్ మల్లిక్ రామ్, తదితరులు ఉన్నారు.
Similar News
News April 20, 2025
ప.గో: ‘శిక్షణ.. సబ్సిడీతో రూ.10లక్షల రుణం’

డ్రోన్ కొనుగోలుకు రైతు గ్రూపులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు, డ్రోన్ గ్రూపు సభ్యులు కన్వీనర్, కో కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. డ్రోన్ పైలెట్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డ్రోన్ కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రూ.10 లక్షల రుణం అందిస్తామన్నారు.
News April 19, 2025
ఉండి: మహిళ మెడలో గొలుసు అపహరణ

ఉండి రాజుల పేటలో ఉంటున్న అగ్ని మాత్రం వరలక్ష్మి మెడలోని 4 కాసుల బంగారు తాడును శనివారం గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. వరలక్ష్మి గత పది సంవత్సరాలుగా ఉండిలో నివాసం ఉంటుంది. శనివారం వేకువజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి డోర్ తీసుకొని వచ్చి అటు ఇటు చూస్తుండగా వరలక్ష్మి ఎవరు అని అడగగా, తన నోరునొక్కి మెడలోని బంగారు తాడును లాక్కెళ్లాడు. పోలీసులు విచారణ చేపట్టారు.
News April 19, 2025
వల్లూరులో సందడి చేసిన సినిమా యూనిట్

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘మధురం’ చిత్ర యూనిట్ ఆచంట మండలం వల్లూరులో సందడి చేసింది. తాను తీసిన మొదటి సినిమాను ప్రేక్షకులు అందరూ విజయవంతం చేయాలని వల్లూరుకు చెందిన హీరో ఉదయ్ రాజ్ కోరారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో మొత్తం షూటింగ్ జరిగిందన్నారు. తనను ఆదరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.